బీటా టెస్టింగ్కు రిలయన్స్ ఫీచర్పోన్లు నేటి నుండే మార్కెట్లోకి
ముంబై: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలి బ్యాచ్ రిలయన్స్ ఫీచర్ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. బీటా ట్రయల్స్ కోసం ఆగష్టు 15వ, తేది నుండి ఎంపిక చేసిన యూజర్లకు రిలయన్స్ జియో అందిస్తోంది.
ఆగష్టు 15వ, తేది నుండి సెప్టెంబర్ వరకు ఈ ఫోన్ను టెస్ట్ చేయనున్నారు. ఈ ఫోన్ను తొలుత బీటా ట్రయల్స్కు అందుబాటులోకి తెచ్చిన తర్వాత మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

తమ నెట్వర్క్ పరిధిలోని వ్యక్తులతో జియో ఫోన్ రిలయన్స్ బీటా టెస్ట్ చేస్తోంది. ఈ ట్రయల్స్లో సాఫ్ట్వేర్, హర్డ్వేర్ సమస్యలు ఏమైనా ఉన్నాయోనని కంపెనీ తేల్చనుంది.
దేశంలోని 22 బాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తోంది. వాయిస్ కమాండ్ ద్వారా ఫోన్ పనిచేస్తోంది. జియో సినిమాయాప్లో ఉచితంగా సినిమాలు ,టీవి చానెల్స్ ఉచితంగా చూసే వెసులుబాటు ఉంది.












Click it and Unblock the Notifications