కాందహార్ హైజాక్పై ‘రా’ మాజీ చీఫ్ సంచలనం
న్యూఢిల్లీ: రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ కాందహార్ విమానం హైజాక్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాందహార్ హైజాక్ను ఆపడానికి పక్కా ప్రణాళికలు రూపొందించినా.. ఢిల్లీలో కూర్చుని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారుల వల్లే ఆ హైజాక్ను ఆపలేకపోయామని చెప్పారు.
ఆయన రచించిన ‘కాశ్మీర్: ది వాజ్పేయి ఇయర్స్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఖాట్మాండు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం హైజాక్ అయినట్టు సమాచారం అందింది. ఇంధనం కోసం విమానం కొద్ది సమయం అమృతసర్లో ఆగింది. ఆ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అప్పటి పంజాబ్ పోలీస్ చీఫ్ సరబ్జీత్ సింగ్ పక్కా ప్రణాళికలు రూపొందించారు' అని చెప్పారు.

‘సుశిక్షితులైన కమాండోలను కూడా సిద్ధం చేశారు. అయితే దీనికి అనుమతివ్వాల్సిన ఢిల్లీ పెద్దలు మాత్రం వెనకడుగు వేశారు. దీంతో ఉగ్రవాదులు విమానాన్ని కాందహార్కి తీసుకెళ్లి వారి డిమాండ్లు నెరవేర్చుకున్నార'ని దౌలత్ తన పుస్తకంలో రాశారు.
అధికారుల నిర్వామకంతో విమాన హైజాకార్ల ముందు మనం దద్దమ్మలమైపోయామని ఆయన వాపోయారు. అయితే అందుకు బాధ్యులైన అధికారుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ‘జైష్-ఎ-మహ్మద్' వ్యవస్థాపకుడు మౌలనా మసూద్ అజహర్తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను విడిపించుకునేందుకే కాందహార్ హైజాక్ జరిగిన విషయం తెలిసిందే.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications