వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమానాస్పద స్థితిలో ఐఐటి కాన్పూర్ విద్యార్థి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

 Kanpur IIT Student Found Dead Inside Hostel Room
కాన్పూర్: ఐఐటి కాన్పూర్ బిటెక్ తృతీయ సంవత్సరం విద్యార్థి ఒకతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. హాస్టల్ గదిలో అతని మృతదేహం గురువారంనాడు ఉదయం కనిపించింది. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సంస్థ అధికారులు అంటున్నారు. మృతుడిని మంజనాథ్‌ (20)గా గుర్తించినట్లు అధికారులు చెప్పారు.

అతను మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని, దాని నుంచి బయటపడడానికి సహాయం కూడా తీసుకుంటున్నాడని వారు చెబుతున్నారు. ఐఐటి కాన్పూర్‌లో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించడం ఈ ఏడాది ఇది రెండో సంఘటన.

ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బిటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి శవం రైల్వే ట్రాక్స్‌పై పడి కనిపించింది. మంజునాథ్ కంప్యూటర్ సైన్స్ చదవుతున్నాడు. పోలియో కారణంగా తన కాళ్లను వాడలేకపోతున్నాడు. అతను కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందినవాడు.

బాల్యంలోనే ఆ విద్యార్థి తండ్రిని కోల్పోయాడని, కొద్ది నెలల క్రితం అతని సోదరి కూడా మరణించిందని ఐఐటి కాన్పూర్ రిజిస్ట్రార్ ఆర్‌కె సచాన్ చెప్పారు. మంజునాథ్ గదిలో విషపదార్థం కనిపించిందని, విషం తీసుకోవడం వల్ల మరణించి ఉంటాడని పోస్టుమార్టం నివేదిక కూడా తెలియజేస్తోందని ఆయన అన్నారు.

మంజునాథ్ మృతి గురించి అతని తల్లికి సమాచారం అందించామని ఆయన అన్నారు. మృతిగల కారణాలను తెలుసుకోవడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

English summary

 A third year B.Tech student at IIT Kanpur was found dead this morning inside his hostel room with officials at the institute saying that the case appeared to be one of suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X