బెంగళూరులో ఈవీలు నడిపే వారికి బిగ్ షాక్
ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈవీలపై ఉన్న 100 శాతం రోడ్డు పన్ను మినహాయింపును రద్దు చేసింది. ఈ మేరకు కర్ణాటక మోటారు వాహన పన్ను చట్టం 2026ను ప్రకటించింది. దీన్ని నోటిఫై చేసింది. దీంతో బ్యాటరీతో నడిచే కార్లు, జీపులు, బస్సులు, ప్రైవేట్ సర్వీస్ వాహనాలకు ఇకపై పన్ను తప్పదు. సాధారణ వాహనాల తరహాలోనే వాటి కొనుగోలుదారులు కూడా రోడ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ సమయంలో వాహనం ధర ఆధారంగా లైఫ్ ట్యాక్స్ విధిస్తారు. 10 లక్షల రూపాయల వరకు ధర ఉండే ఈవీలకు అయిదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ. 10 లక్షల నుండి రూ. 25 లక్షల మధ్య ధర ఉంటే 8, రూ. 25 లక్షలు, ఆపై ధర కలిగిన ఈవీలకు 10 శాతం పన్ను వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లకు మాత్రం ఈ ట్యాక్స్ మినహాయింపు కొనసాగుతుంది. వీటి విషయంలో ఎటువంటి సవరణలు చేయలేదు ప్రభుత్వం.

ఈ నిర్ణయంతో ప్రతి సంవత్సరం రాష్ట్రానికి సుమారు 250 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. పన్ను మార్పు రాకముందే ఈవీ కొనుగోళ్లు పెరిగాయని వాహన్ పోర్టల్ డేటా వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో 3,972 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఫిబ్రవరిలో వీటి సంఖ్య 3,606 లుగా నమోదైంది. మార్చిలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. ఏకంగా 4,663 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ధరలు పెరుగుతాయని డీలర్లు కొనుగోలుదారులకు సూచించడంతో ముందస్తు కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీనికి అనుగుణంగా రోడ్ ట్యాక్స్ రద్దయింది. వాస్తవానికి ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను మినహాయింపు ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం 2016లో. అప్పటి విధానంలో 25 లక్షల రూపాయలకు మించిన ఈవీలకు మాత్రమే జీవితకాల పన్ను ఉండేది.
పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈవీలకు మారాలని వినియోగదారులు భావిస్తున్న వేళ ఇప్పుడున్న పన్నుల ఉపసంహరణ ఒక కీలక విధాన మార్పుగా భావిస్తోన్నారు. ఈ నిర్ణయం ఈవీ తయారీదారులు, కొనుగోలుదారులలో ఆందోళనలను రేకెత్తించింది. దీనివల్ల ఈవీలను కొనుగోలు చేయడానికి వాహనదారులు పెద్దగా చొరవ చూపబోరనే అభిప్రాయాలు ఉన్నాయి. తాజా నిర్ణయం- రాష్ట్రంలో వాటి వృద్ధి వేగాన్ని ప్రభావితం చేయవచ్చనే వాదనలు లేకపోలేదు.
రిజిస్ట్రేషన్ల పరంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దేశంలో నాలుగో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల అమ్ముడయ్యేది కర్ణాటకలోనే. చాలా రాష్ట్రాలు ఈవీలకు పన్ను మినహాయింపులు లేదా రాయితీలు ఇస్తుండగా, గుజరాత్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం పన్నులు వసూలు చేస్తున్నాయి. మోటారు వాహన పన్ను రాష్ట్రానికి ముఖ్యమైన ఆదాయ వనరు కావడం దీనికి ప్రధాన కారణం.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!!












Click it and Unblock the Notifications