వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పంచెకట్టుతో వెళ్లి, మారథాన్లో కిందపడిన మంత్రి, పైకి లేపిన పోటీదారులు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఓ మంత్రి పరుగుపందెం సమయంలో అదుపు తప్పి కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో నిర్వహించిన మారథాన్లో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.
చదవండి: శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే సామూహిక ఆత్మహత్య: శివసేన హెచ్చరిక
ఈ మారథన్లో పాల్గొన్న మంత్రి జీటీ దేవేగౌడ పరుగు తీస్తూ అనుకోకుండా కిందపడ్డారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని మైసూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ ఈ మారథాన్ను నిర్వహించింది. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు.
మారథాన్ సందర్భంగా మంత్రి కూడా పరుగు పెట్టారు. పంచెకట్టుతోనే ఉత్సాహంగా పరిగెత్తారు. కానీ కొంతదూరం వెళ్లిన తర్వాత అతను ఒక్కసారిగా కిందపడిపోయారు. గమనించిన తోటి పోటీదారులు ఆయనను పైకి లేపారు.
{document1}
Comments
English summary
Devegowda, who was wearing 'lungi', a traditional garment worn around the waist, suddenly lost balance while running and fell down. He also sustained minor injuries on his face and legs.
Story first published: Sunday, October 14, 2018, 18:01 [IST]