ఎన్కౌంటర్పై కరుణ సీరియస్, బాబుకు తమిళ సీఎం లేఖ: చింతా తీవ్ర వ్యాఖ్య
చెన్నై/తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో జరిగిన ఎన్కౌంటర్ వివాదాస్పదమవుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం ఖండించారు. గత రెండు నెలలుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్) అదుపు చేయలేకపోతున్నాయన్నారు.
ఇప్పుడు ఇరవై మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఘటనలు జరుగుతున్న సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలే జరపలేదన్నారు. మృతుల కుటుంబానికి తాను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఇరు రాష్ట్రాలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
తమిళనాడు ప్రభుత్వం రహస్య విచారణ?
శేషాచలం అడవులలో జరిగిన ఎన్ కౌంటర్ పైన తమిళనాడు ప్రభుత్వం రహస్య విచారణకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని తమిళనాడు పోలీసులు మంగళవారం సందర్శించారు. దీనిపై వారు విచారిస్తున్నారని తెలుస్తోంది.
బాబుకు పన్నీరు సెల్వం లేఖ
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. మృతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. పూర్తిస్థాయి విచారణ జరిపించలని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబు సమీక్ష
శేషాచలం ఎన్ కౌంటర్ పైన ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం గవర్నర్ నరసింహన్తో ఈ విషయమై ఫోన్లో చర్చించారు.
చేతులు కట్టేసి కాల్చేసినట్లుగా: చింతా మోహన్
శేషాచలం కొండల్లో జరిగిన ఎన్ కౌంటర్ పైన మాజీ ఎంపీ చింతా మోహన్ తీవ్రంగా మండిపడ్డారు. చేతులు కట్టేసి మరీ కాల్చినట్లుగా ఉందని ఆరోపించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు. కారంచేడు తర్వాత ఇదే అతిపెద్ద బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపించారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications