Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ. 5.60కోట్ల లంచం తీసుకున్న బీజేపీ నేత: ఆ పార్టీ దర్యాప్తులోనే తేలింది!

ఓ మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నుంచి అనుమతి ఇప్పిస్తానంటూ ఓ వ్యాపారవేత్త నుంచి కేరళకు చెందిన ఓ బీజేపీ నేత రూ. 5.60కోట్లు లంచం తీసున్నారు.

తిరువనంతపురం: ఓ మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నుంచి అనుమతి ఇప్పిస్తానంటూ ఓ వ్యాపారవేత్త నుంచి కేరళకు చెందిన ఓ బీజేపీ నేత రూ. 5.60కోట్లు లంచం తీసున్నారు. మీడియానో, ఇతర రాజకీయ పార్టీల నేతలో చేసిన ఆరోపణ కాదు ఇది. ఏకంగా బీజేపీ దర్యాప్తు బృందం జరిపిన విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం.

అయితే, ఈ బీజేపీ నేతపై పార్టీ దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదిక కాస్తా మీడియాకు లీకైంది. దీంతో కేరళలో ఈ విషయంపై రచ్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని ప్రత్యర్థి పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Kerala BJP leader took Rs 5.60 crore to get MCI nod for college: Reports

అవినీతి రహిత పాలన అందిస్తున్నామని మోడీ చెబుతున్నారని, అయితే, ఈ బీజేపీ నేత చేసిన పనేంటని వారు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ అయిన ఆర్ఎస్ వినోద్.. వర్కలలోని ఎస్ఆర్ ఆస్పత్రికి కాలేజీ హోదా కల్పించేందుకు ఈ మేరకు లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలో వినోద్‌పై బీజేపీ అంతర్గతంగా జరిపిన దర్యాప్తు బృందం నివేదికను ఆ పార్టీలోని అసమ్మతి వర్గం మీడియాకు లీక్ చేయడంతో ఈ వ్యవహారం బయటికి పొక్కింది. కాగా, ఈ విషయంపై తాము పార్లమెంటులో చర్చకు డిమాండ్ చేస్తామని ప్రత్యర్థి పార్టీల నేతలు అంటున్నారు.

గురువారం ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ కేరళ ప్రధాన కార్యదర్శి శోభా సురేంద్రన్.. ఈ నివేదికను పార్టీ నాయకత్వానికి తెలియజేయాల్సి ఉందని చెప్పారు. ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. లీకేజీ వ్యవహారంపైనా తమ పార్టీలో అంతర్గత విచారణ జరుపుతామని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+