టీవీ పనిచేయలేదు, ఆన్ లైన్ తరగతులు వినలేదు.. విద్యార్థిని బలవన్మరణం...
లాక్డౌన్ వల్ల కేరళ ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తోంది. అయితే చాలా మంది పేదలు ఉండటంతో వారింట్లో నెట్, టీవీ లేకపోవడం సమస్యగా మారింది. అలాగే మలప్పురం జిల్లాకు చెందిన 9 తరగతి విద్యార్థినికి కూడా టీవీ సదుపాయం లేదు. వాస్తవానికి వారింట్లో టీవీ ఉంది.. కానీ అది రిపేర్ కావడంతో సమస్య ఏర్పడింది. దానిని బాగు చేయించాలని పేరంట్స్ను కోరిన ఫలితం లేకుండా పోయింది.
దీంతో ఆ దళిత నిరుపేద మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారింట విషాదఛాయలు అలుముకున్నాయి. టీవీ బాగు చేయించాలని తనను కోరిందని.. కానీ తన వద్ద అంత డబ్బులు లేవు అని బాలిక తండ్రి అంటున్నాడు. లాక్ డౌన్ వల్ల కూలీ చేసే తనకు.. ఆడపా దడపా పనులు దొరకడంతో చేస్తున్నానని తెలిపారు. టీవీ రిపేర్ చేయించే బదులు స్నేహితుల ఇంటికి వెళ్లాలని సూచించానని పేర్కొన్నారు. అయితే ఆ బాలిక తల్లి కొద్దిరోజుల క్రితం పసిపాపకు జన్మనిచ్చింది. దీంతో ఖర్చులు ఉండటంతో... టీవీ రిపేర్ చేయడం వీలుకాలేదు.

టీవీ రిపేర్ చేయకపోవడంతో బాలిక మనస్పర్థకు గురైంది. తాను ఆన్ లైన్ క్లాసులు వినకుంటే ఎలా అని మదనపడింది. ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి సీ రవీంద్రనాథ్ స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications