Human sacrifice: నరబలి టైమ్ లో డాక్టర్ భార్యతో రొమాన్స్, ప్రైవేట్ పార్ట్స్ తో కూర చేసి తినేసి!
తిరువనంతపురం/ కొచ్చి: కేరళలో జరిగిన మహిళల నరబలి కేసు మరో మలుపు తిరిగింది. మంత్రగాడిని నమ్ముకున్న నాటు వైద్యుడు ఇద్దరు మహిళలను అతని ఇంట్లోనే చంపేశాడు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న వైద్యుడు, అతని భార్య, మాయాల మాంత్రికుడు చెబుతున్న సమాచారంతో పోలీసులు, సామాన్య ప్రజలు హడలిపోయారు. నరబలి ఇవ్వడానికి నాటు వైద్యుడు నకిలి మాంత్రికుడికి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చాడని వెలుగు చూసింది.
మహిళల ప్రైవేట్ పార్ట్స్ ముక్కలు ముక్కలు చేసి వంట చేసుకుని తిన్నారని వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోయారు. మహిళలను హత్య చేసి వారి శవాలను 60 ముక్కలు చేశారని వెలుగు చూసింది. నరబలి ఇచ్చే సమయంలో మాంత్రికుడితో వైద్యుడి భార్య రొమాన్స్ చేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసు స్థానిక పోలీసుల చేతి నుంచి సిట్ చేతికి వెళ్లిపోయింది.

నాటు వైద్యుడికి నానా కష్టాలు
కేరళలోని పతనంమిట్టలోని తిరువళ్లలో నివాసం ఉంటున్న నాటు వైద్యుడు భగవాల్ సింగ్ అలియాస్ డాక్టర్ భగవాల్ సింగ్ కు లైలా అనే మహిళతో వివాహం అయ్యింది. చాలా సంవత్సరాల నుంచి నానటు వైద్యుడు భగవాల్ సింగ్ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎలాగైనా కోటీశ్వరుడు అయిపోవాలని భగవాల్ సింగ్ కలలుకన్నాడు.

నరబలి ఒక్కటే పరిష్కారం
మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వాలని, తరువాత నువ్వు కోటీశ్వరుడు అయిపోతావని మాంత్రికుడు మోహమ్మద్ షఫీ నాటు వైద్యుడు భగవాల్ సింగ్ కు చెప్పాడు. మంత్రగాడు మోహమ్మద్ షఫీ వేర్వేరుగా లాటరీ టిక్కెట్లు విక్రయిస్తున్న రోసలిన్, పద్మాలను కలిశాడు.

మహిళలు ఒక్కొక్కరికి రూ. 15 వేలు అడ్వాన్స్
సినిమాల్లో నటించడానికి మీకు చాన్స్ ఇప్పిస్తానని, మీరు నాతో వస్తే డబ్బులు కూడా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. పధ్మా, రోసలిన్ కు ఒక్కొక్కరిని రూ. 15 వేలు ఇచ్చిన మాంత్రికుడు మోహమ్మద్ షఫీ నాటు వైద్యుడు భగవాల్ సింగ్ ఇంటికి పిలుచుకుని వెళ్లి మహిళలు కుర్చోబెట్టి క్షుద్రపూజలు చేశాడు.

మహిళల మాంసంతో వంటలు?
పధ్మా, రోసలిన్ ల గొంతులు కోసి హత్య చేసే ముందు వారి ప్రైవేట్ పార్ట్స్ ను కత్తితో కోసేసి ముక్కలు చేశారని, తరువాత మహిళల శవాల ముక్కలతో వంట చేసుకుని నాటు వైద్యుడు భగవాల్ సింగ్, లైలా దంపతులు తిన్నారని, ఆ సమయంలో సైకో లాగా మాంత్రికుడు మోహమ్మద్ షఫీ ఆనందించాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

నరబలికి రూ. 10 లక్షలు డీల్
నరబలి ఇవ్వడానికి నువ్వే మహిళలను తీసుకురావాలని నాటు వైద్యుడు భగవాల్ సింగ్ మోహమ్మద్ షఫీకి చెప్పాడు. నరబలి ఇవ్వడానికి నాటు వైద్యుడు భగవాల్ సింగ్ నకిలి మాంత్రికుడు మోహమ్మద్ షఫీకి రూ. 10 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

మహిళలను 60 ముక్కలు చేసి ఆనందించారు
సినిమా షూటింగ్ జరుగుతోందని, మిమ్మల్ని మంచానికి కట్టేసే సీన్లు తీస్తారని చెప్పారు. రోసలిన్, పధ్మాలను నగ్నంగా చేసి మంచానికి కట్టేసి ఇద్దరి గొంతులకు కోసేసి మహిళల ప్రైవేట్ పార్ట్స్ ముక్కలు ముక్కలు చేశారని, శవాలును 60 ముక్కలు చేశారని, ఇద్దరు శవాల నుంచి కొన్ని ముక్కలు తీసుకుని వంట చేసుకుని తిన్నారని అధికారుల విచారణలో వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోయారు.

పోలీసుల చేతులు మారిన కేసు
కేరళలో పధ్మా, రోసలిన్ నరబలికి గురైనా వెలుగు చూడటంతో దేశం మొత్తం కలకలం రేపింది. ఎక్కడ చూసినా కేరళల మహిళల నరబలి విషయంలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. మహిళల నరబలి కేసును సిట్ ఏర్పాటు చేసి అప్పగిస్తున్నామని కేరళ డీజీపీ అనీల్ కాంత్ మీడియాకు చెప్పారు.కేసు విచారణను సీనియర్ పోలీసు అధికారి, కొచ్చి సిటీ డిప్యూటీ పోలీసు కమీషర్ శశిధర్ కు అపపగించామని డీజేపీ అనీల్ కాంత్ మీడియాకు చెప్పారని కేరళ మీడియా అంటోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications