బ్యాంకులో రద్దీ, చిన్నపొరపాటుతో అదే బ్యాంకులో మహిళ మృతి, ప్రాణం తీసిన స్కూటర్ తాళం, గ్లాస్ డోర్ !
తిరువనంతపురం: లాక్ డౌన్ సందర్బంగా బ్యాంకులో పని త్వరగా అయిపోదనే ఆత్రుతగా వెళ్లిన మహిళ అదే ఆత్రుతలో చేసిన చిన్న పోరపాటుకు ప్రాణం పోగొట్టుకుంది. బ్యాంకులోకి వెళ్లిన మహిళ పని పూర్తి కాకుండా మళ్లీ బయటకు వెళ్లడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో బ్యాంకు ముఖ ద్వారం దగ్గర అలంకరణ కోసం ఏర్పాటు చేసిన గ్లాస్ డోర్ ను ఆమె ఢీకొనింది. గ్లాస్ డోర్ అద్దాలు పగిలిపోవడంతో ఆ ముక్కలు ఆమె కడుపులోకి చొచ్చుకుని వెళ్లి ప్రాణాలు పోగొట్టుకునింది.

కేరళ మహిళ
కేరళలోని పెరంబవూరు లోని చెరనెల్లూరు ప్రాంతంలో బీనా జిజు పాల్ (46) అనే మహిళ నివాసం ఉంటున్నది. బీనా జిజు పాల్ అనే మహిళక పెరంబవూరులోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో ఖాతా ఉంది. బ్యాంకు పని మీద సోమవారం బీనా జిజు పాల్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు దగ్గరకు స్కూటర్ లో వెళ్లింది.

స్కూటర్ కు తాళం వదిలి బ్యాంకులోకి
స్కూటర్ బయట పార్క్ చేసిన బీనా జిజు పాల్ దానికి తాళం అలాగే వదిలేసి బ్యాంకులోకి వెళ్లింది. బ్యాంకులో పని చూసుకుంటున్న సమయంలో బీనా జిజు పాల్ ఆమె బ్యాగును పరిశీలించింది. బ్యాగులో స్కూటర్ తాళం కనపడకపోవడంతో బీనా జిజు పాల్ ఆందోళనకు గురైయ్యింది. తన స్కూటర్ కు తాళం వదిలేసి వచ్చానని, ఎవరైనా ఆ స్కూటర్ ఎత్తుకుని వెళ్లిపోతారని బీనా జిజు పాల్ మరింత ఆందోళనకు చెందింది.

గ్లాస్ డోర్ మూసేశారని గుర్తించలేక !
బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు ముఖ ద్వారంలో పెద్దగా గ్లాస్ డోర్ ఏర్పాటు చేశారు. స్కూటర్ తాళం ఎక్కడపోతుందే అనే ఆందోళనతో వేగంగా పరుగు తీస్తూ బ్యాంక్ ముఖ ద్వారం దగ్గరకు వెళ్లిన బీనా జిజు పాల్ గ్లాస్ డోర్ తీసిపెట్టారని పోరపాటున దానిని ఢీకొనింది. ఒక్కసారిగా గ్లాస్ డోర్ ను బీనా జిజు పాల్ ఢీకొనడంతో ఆ అద్దాం ముక్కలు అయిపోయింది.

చిన్నపోరపాటుతో !
బ్యాంకు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు, సిబ్బంది కలిసి కుప్పకూలిపోయిన బీనా జిజు పాల్ ను పైకి లేపారు. అయితే అప్పటికే గ్లాస్ డోర్ పగిలిపోయి అద్దం ముక్కలు ఆమె పొత్తికడుపులోకి దూసుకెళ్లాయి. తీవ్రగాయాలైన మహిళను అక్కడ ఉన్న కుర్చీలో కుర్చోపెట్టకుండా ఆత్రుతతో ఆమెను పెరంబవూరులోని ఆసుపత్రికి, అక్కడి నుంచి ఎర్నాకులం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.
Recommended Video

బ్యాంకు సీసీ కెమెరాల్లో రికార్డు
ఆసుపత్రిలో చికిత్స విఫలమై బీనా జిజు పాల్ మరణించిందని పోలీసులు తెలిపారు. ఆత్రుతో స్కూటర్ తాళం వెలుతున్న సమయంలోనే పొరపాటును బీనా జిజు పాల్ గ్లాస్ డోర్ ను ఢీకొనిందని, ఆ అద్దం ముక్కు కడుపులోకి దూసుకోవడం వలనే ఆమె మరణించిందని, ఆ పూర్తి సమాచారం బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో క్లియర్ గా రికార్డు అయ్యిందని పెరంబవూరు పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications