నిర్లక్ష్యంగా డ్రైవింగ్: 'అతి తక్కువ శిక్షలు, న్యాయవ్వవస్ధ అపహాస్యం పాలవుతోంది'
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల కేసుల్లో అతి తక్కువ శిక్షలు విధిస్తున్నారని సుప్రీం కోర్టు మండిపడింది. దీని మూలంగా భారత న్యాయవ్వవస్ధ అపహాస్యం పాలవుతోందని పేర్కొంది. 2007లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇద్దరు వ్యక్తుల మరణానికి దారితీసిన కేసుని విచారించిన సుప్రీం కోర్టు పైవ్యాఖ్యలు చేసింది.
వెంటనే 304ఎ చట్టాన్ని పునరాలోచించాలని లా మేకర్స్కు సూచించింది. ఇటీవల కాలంలో వాహనాలు నిర్లక్ష్యంగా నడపడం మూలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరగడాన్ని గమనించామని, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నామని దీపక్ మిశ్రా, ప్రపుల్లా సీ పంత్లతో కూడిన ద్విసభ్య బెంచ్ పేర్కొంది.

దేశంలోని పేదలు తమ ప్రాణాలకు రక్షణ లేదని భావిస్తున్నారని, పాదచారులు సైతం అయోమయ స్ధితిలో ఉండిపోతున్నారని బెంచ్ విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. నాగరీకులుగా చెప్పుకునే కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇతరులు బలై పోతున్నారని అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఉన్న ఈ శిక్షలు బాధితులు, వారికి సంబంధించిన ఎంతోమంది ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికైనా లా మేకర్స్ వీటిని పునఃసమీక్షించాలని తెలిపింది. ఐసీసీ సెక్షన్ 304ఎ ప్రకారం నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి దారి తీసిన కేసుల్లో రెండు సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications