బాలికపై రేప్: మహిళ పట్ల అసభ్యంగా ముసలి
చెన్నై/ ముంబై: మానసిక స్థిమితం సరిగా లేని ఎనిమిదేళ్ల బాలికపై తమిళనాడులోని నమక్కల్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రమేష్ అనే వ్యక్తి బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెపై గత రాత్రి అత్యాచారం చేశాడు.
బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని రమేష్ను అరెస్టు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ముంబైలోని ఫోర్ట్ స్టార్బక్స్ ఔట్లెట్లో వాకేశ్వర్కు చెందిన 75 ఏళ్ల సీనియర్ పౌరుడు 30 ఏళ్ల మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ ఓ ఓ ప్రైవేట్ బ్యాంకులో రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తోంది. అశోక్ దేశాయ్ అనే 75 ఏళ్ల వ్యక్తి తమ బ్యాంకులో డబ్బులు పెట్టడానికి వచ్చాడని, విధానం చెప్పి ఐదో తారీఖున రావాలని తాను చెప్పానని మహిళ మిడ్డేతో చెప్పింది.
తనకు పని ఉందని హోర్నిమ్యాన్ సర్కిల్లోని స్టార్బక్స్ అవుట్ లెట్కు రావాలని, అక్కడ కొంత పని ఉందని చెప్పాడని, తాను డబ్బులు పెట్టే వద్ధతిపై వివరిస్తుండగా అతను తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పింది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ను ముట్టుకుని అసభ్యంగా ప్రవర్తించానని అంగీకరిస్తూ తనను క్షమించాలని అతను కోరాడు. అశోక్ దేశాయ్ని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications