Viral: సిగరెట్ తాగొద్దన్నందుకు పెట్రోల్ బంకుకే నిప్పు పెట్టాడు!
ఓ పెట్రోల్ బంకు వద్ద క్షణికావేశం పెను ప్రమాదానికి దారితీసింది. మనిషి ప్రాణం కంటే సిగరెట్ పొగ ముఖ్యం అనుకున్నాడో లేక తనను వారించినందుకు అహం దెబ్బతిందో కానీ, ఒక యువకుడు చేసిన పనికి పెట్రోల్ పంపు అగ్నిగుండంగా మారింది. ఆ నిప్పు కణిక పెను విపత్తుగా మారే లోపే బంకు సిబ్బంది చేసిన సాహసం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సామాన్యంగా పెట్రోల్ పంపుల వద్ద 'నో స్మోకింగ్' అనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, ఛత్తీస్గఢ్లోని ఊర్లా ప్రాంతంలో గురువారం సాయంత్రం జరిగిన సీన్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ధర్మేంద్ర క్షత్రియ, ఇమ్రాన్ అనే ఇద్దరు వ్యక్తులు తమ బైక్లో పెట్రోల్ పోయించుకోవడానికి బంకుకు వచ్చారు. బైక్ ట్యాంక్ మూత తెరవగానే, ధర్మేంద్ర సిగరెట్ వెలిగించేందుకు ప్రయత్నించాడు.

హెచ్చరిస్తే.. హత్యాప్రయత్నం చేస్తావా?
అక్కడ ప్రమాదం జరుగుతుందని గమనించిన పంపు సిబ్బంది వెంటనే అతడిని వారించారు. "ఇక్కడ సిగరెట్ కాల్చవద్దు, ప్రమాదం" అని చెప్పడమే ఆ సిబ్బంది చేసిన పాపం. ఆ మాట వినగానే ధర్మేంద్రకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోతూ తన చేతిలో ఉన్న లైటర్తో నేరుగా పెట్రోల్ వస్తున్న 'ఫ్యూయల్ నాజిల్' పైపుకే నిప్పు అంటించాడు.
క్షణాల్లో చెలరేగిన అగ్ని
పెట్రోల్ నాజిల్ కాబట్టి నిప్పు తగలగానే మంటలు ఒక్కసారిగా విరజిమ్మాయి. ఆ మంటలు వేగంగా బైక్ ట్యాంక్కు, పంపు మిషన్కు వ్యాపించాయి. అక్కడున్న వారంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు. నిందితుల మీద కూడా మండే పెట్రోల్ పడటంతో వారు కూడా షాక్కు గురయ్యారు.
Man lights fire at petrol pump in Raipur. Staff rush to stop disaster...
— contentkikamii (@contentkikamii) February 20, 2026
🚨 CCTV footage shows a man setting fire near a petrol pump nozzle at Sangeeta Fuels, Raipur, Chhattisgarh. Staff acted fast to prevent disaster. Both accused arrested. pic.twitter.com/3r6ey6uFtU
రియల్ హీరోలు..
పెద్ద పేలుడు సంభవించి అందరూ చనిపోతారనుకున్న తరుణంలో, ఒక పంపు అటెండర్ ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. వెంటనే ఫ్యూయల్ పైపును పక్కకు లాగేసి, మెయిన్ సప్లైని నిలిపివేశాడు. మిగిలిన సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో (Fire Extinguishers) క్షణాల్లో మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఆ మంటలు భూగర్భంలోని ట్యాంకులకు వ్యాపించి ఊర్లా ప్రాంతం అతలాకుతలమయ్యేది.
పోలీసుల వేట.. నిందితుల అరెస్ట్
ప్రమాదాన్ని సృష్టించి పారిపోవాలని చూసిన నిందితులిద్దరినీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ధర్మేంద్ర, ఇమ్రాన్లను అరెస్ట్ చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించడం, అగ్నిప్రమాదానికి కారకులవ్వడం వంటి సెక్షన్ల కింద వీరిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్స్పెక్టర్ రోహిత్ మహేల్కర్ తెలిపారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications