ప్రముఖ పాత్రికేయుడు మార్క్ టూలీ(90) కన్నుమూత
ప్రముఖ పాత్రికేయుడు మార్క్ టూలీ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. మార్క్ టూలీ మరణాన్ని అతడి క్లోజ్ ఫ్రెండ్ సతీశ్ జాకోబ్ ధ్రువీకరించారు. మార్క్ టూలీ దిల్లీలోని మాక్స్ హాస్పిటల్ సాకేత్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. టూలీ అనారోగ్య కారణాలతో జనవరి 21 న ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. నెఫ్రాలజీ డిపార్ట్ మెంట్ కింద చికిత్స పొందుతూ తాజాగా ఆయన తుది శ్వాస విడిచారు.
ఇక ప్రస్తుతం మార్క్ టూలీ బీబీసీ దిల్లీ బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు. 1992 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా అందజేసింది. అలాగే 2005 లో పద్మభూషన్ పురస్కారంతో సత్కరించింది. మార్క్ టూలీ మృతితో మీడియా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. 1935 లో కోల్ కతాలోని ఓ బ్రిటిష్ ఫ్యామిలీలో మార్క్ టూలీ జన్మించారు. మీడియా రంగంలో అంచలంచెలుగా ఎదిగారు. మీడియా రంగంలో విశేష కృషి చేశారు.
మార్క్ టూలీ మృతిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి విచారం వ్యక్తం చేశారు. టూలీ మృతి పట్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని పేర్కొన్నారు. 1978లో తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చేరినప్పుడు టూలీతో జరిగిన మొదటి పరిచయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. భారత్ లో బీబీసీ సుదీర్ఘకాలం కరస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా పనిచేశారని కొనియాడారు.

అలాగే మార్క్ టూలీ మరణంపై మాజీ రాజ్యసభ ఎంపీ, కాలమిస్ట్ స్వపన్ దాస్గుప్తా సంతాపం తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం ఏదైనా సంఘటనపై టూలీ ఇచ్చే బీబీసీ ప్రసారాలే అంతిమ తీర్పుగా పరిగణించబడేవని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications