సూరత్ వజ్రాల వ్యాపారి ఉదారత: 251 మంది యువతులకు సామూహిక వివాహాలు
సూరత్: సూరత్ వజ్రాల వ్యాపారి ఒకరు తన మంచితనాన్ని చాటుకున్నారు. తండ్రి లేని, పేదలైన 251 మంది సూరత్ యువతులకు సామూహిక వివాహం జరిపించారు. గత వారం ఈ పెళ్లి జరిగింది.
గత ఐదేళ్లుగా ఆయన వేలాది మందికి సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఈ ఏడాది తన పీపీ సవాని ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 251 మంది వివాహాలు జరిపించారు.

2012 నుంచి ఆయన కన్యాదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి కన్యాదానం చేశారు. ఈ ఏడాది 22వ తేదీ నుంచి మెహందీ కార్యక్రమం ప్రారంభమైంది.
కేవలం హిందూ యువతులకే కాకుండా ఇతర మతాల పేద యువతులకు కూడా ఆయన పెళ్లిళ్లు జరిపించడం గమనార్హం. ఈ ఏడాది జరిపిన 251 మంది యువతుల పెళ్లిళ్లలో ఐదుగురు ముస్లీం, ఒకరు క్రైస్తవ యువతి ఉన్నారు.












Click it and Unblock the Notifications