Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Meerut Murder: భర్తను చంపి, ముక్కలు చేసి.. సంచలన కేసులో బయటపడుతున్న వాస్తవాలు!

Meerut Murder: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో బ్రహ్మపురి ప్రాంతంలో జరిగిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ హత్యకేసులో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి మోజులో పడిన ముస్కాన్ అనే ఇల్లాలు డ్రగ్స్ అలవాటు కారణంగా తన భర్త సౌరభ్ రాజ్ పుత్ ను ప్రియుడితో కలిసి అత్యంత పాశవికంగా హత్య చేసింది. సౌరభ్ మృతదేహాన్ని ప్రియుడు సాహిల్ తో కలిసి 15 ముక్కలు చేసి డ్రమ్ములో పూర్తిగా సిమెంట్ తో నింపి దాచేశారు. మార్చి 4న సౌరభ్ ను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్ములో దాచేశారు. తన ప్రియుడు సాహిల్ కోసమే ముస్కాన్ సౌరభ్ ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అనంతరం వారిద్దరూ ఇంట్లో హాయిగా నిద్రించినట్లు తెలిసింది. అయితే తమ అల్లుడు చాలా మంచివాడని.. సౌరభ్ ను చంపిన తమ కూతురిని ఉరితీయాలని ముస్కాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. లేదంటే తామే ముస్కాన్ ను చంపేస్తామన్నారు.

లండన్ నుంచి వచ్చి..

లండన్ లో మర్చంట్ నేవీ అధికారిగా పని చేస్తున్న సౌరభ్ రాజ్పుత్ కొద్ది రోజుల క్రితమే స్వస్థలమైన మీరట్ కు వచ్చాడు. మార్చి 4న సౌరభ్ అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. సౌరభ్ హత్య కేసులో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక రహస్యాలు బయటపడుతున్నాయి. సాహిల్ ముస్కాన్ వివాహం తర్వాత ఆమె జీవితంలోకి వచ్చాడని గతంలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం తర్వాత కూడా ఆమెకు ఒక అపరిచితుడితో సంబంధం ఉంది, ఆపై తన ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసింది. కానీ వాస్తవం వేరేలా మారింది.

Meerut Murder Case Shocking Truths Behind the Brutal Killing of Merchant Navy Officer Saurabh

చిన్నప్పటి నుంచే..
మీడియా నివేదికల ప్రకారం, ముస్కాన్, సాహిల్ మధ్య సంబంధం కొత్తది కాదు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు తెలుసు, కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. వారిద్దరూ బ్రహ్మపురిలోని వివేకానంద పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. తరువాత వారు పాఠశాలలు మార్చుకున్నారు. వారి మార్గాలు విడిపోయాయి. వారి జీవితాలు ముందుకు సాగాయి. సంవత్సరాల తరువాత, సోషల్ మీడియా వారిని మళ్ళీ ఒకచోట చేర్చింది.

స్నేహం కాస్త..

వారి పాత పాఠశాల మిత్రులు ఒక వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించారు, అందులో ముస్కాన్, సాహిల్ కూడా చేరారు. ఆ గ్రూపులో చర్చ మొదలైంది, అది త్వరలోనే వ్యక్తిగత సంభాషణగా మారింది. ముస్కాన్ వివాహం చేసుకుంది. కానీ ఆమె భర్త సౌరభ్ లండన్ వెళ్ళాడు. ముస్కాన్ ఇక్కడ ఒంటరిగా నివసిస్తోంది. ఇంతలో సాహిల్‌తో ఆమె సాన్నిహిత్యం బాగా పెరిగిపోయింది. వారు మీరట్ మార్కెట్లలో కలవడం ప్రారంభించారు. కలిసి తిరగడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ స్నేహం ప్రేమగా మారింది. క్రమంగా సాహిల్ ముస్కాన్ జీవితంలో ఒక భాగమయ్యాడు. ఎంతగా అంటే అతను నా ఇంటికి రావడం ప్రారంభించాడు. దీనికి ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేయగా.. ముస్కాన్ భర్త సౌరభ్‌కు కూడా ఫిర్యాదు చేశారు. సౌరభ్ ముస్కాన్‌తో సాహిల్ నుండి దూరం కొనసాగించమని కూడా చెప్పాడు. కానీ ముస్కాన్ తన మాటలతో ఆమె భర్తను ఒప్పించింది. సాహిల్ తో ఆమె సంబంధం మరింత గాఢమైంది.

సాహిల్ ఖర్చులేని ముస్కాన్ భరించేది..
సాహిల్ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ముస్కాన్ అతని ఖర్చులను కూడా భరించింది. ముస్కాన్ అతనికి చాలాసార్లు డ్రగ్స్ కోసం డబ్బు కూడా ఇచ్చిందని తెలిసింది. సౌరభ్ పంపిన డబ్బును ఆమె సాహిల్ కు ఉపయోగించుకుంది. సౌరభ్ 24 ఫిబ్రవరి 2025న లండన్ నుండి మీరట్ కు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో సౌరభ్ ను హత్యచేయడానికి పథకం వేశారు. పథకం ప్రకారం.. ముస్కాన్ ఓ మెడికల్ స్టోర్ నుంచి మత్తు మందును కొనుగోలు చేసింది. సాహిల్ పదునైన కత్తిని కొన్నాడు. ఫిబ్రవరి 26న రాత్రి ముస్కాన్ మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేయగా.. సాహిల్ కత్తితో దారుణంగా హత్య చేశాడు. కానీ అప్పుడు అసలు సమస్య వచ్చి పడింది. మృతదేహాన్ని ఎలా మాయం చేయాలి?

డ్రమ్ము కొనుగోలు చేసి..
సౌరభ్ మృతదేహాన్ని దాచేందుకు ముస్కాన్, సాహిల్ మొదట ప్లాస్టిక్ సంచిని ఉపయోగించాలని అనుకున్నారు. కానీ శరీరం బ్యాగులో సరిపోకపోవడంతో మరో ఉపాయాన్ని ఆలోచించారు. ముస్కాన్ ఘంటాఘర్ నుండి ఒక పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్ కొని, అందులో మృతదేహాన్ని ఉంచాలని ప్రణాళిక వేసుకుంది. ఇది కాకుండా, మృతదేహాన్ని పూర్తిగా దాచడానికి వీలుగా శారదా రోడ్డు నుండి సిమెంట్, ఇసుకను కూడా కొనుగోలు చేశారు. అనంతరం ఇద్దరూ మృతదేహాన్ని ముక్కలుగా కోసి, డ్రమ్ములో నింపి దానిపై సిమెంట్ ద్రావణాన్ని పోశారు. దీని తరువాత వారిద్దరూ సిమ్లా, ముస్సోరీలను సందర్శించడానికి వెళ్లారు. ఇక్కడ ముస్కాన్ తన చాకచక్యాన్ని ప్రదర్శించింది. ఆమె సౌరభ్ తో విహారయాత్రకు వెళ్తున్నట్లు చుట్టుపక్కల వారికి ముందే తెలియజేసింది. సిమ్లా వెళ్ళిన తర్వాత, ముస్కాన్ తన మొబైల్ ఫోన్ నుండి సౌరభ్ గా నటిస్తూ సౌరభ్ సోదరికి సందేశాలు పంపింది. తద్వారా అందరూ సౌరభ్ బతికే ఉన్నాడని అనుకున్నారు.

ఈ హత్య గురించి ముస్కాన్ తల్లిదండ్రులు నిజం తెలుసుకుని షాక్ అయ్యారు. తన కూతురికి మద్దతు ఇవ్వడం లేదని వారు స్పష్టంగా చెప్పారు. సౌరభ్ మంచి వ్యక్తి అని.. అతనికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తమ కూతురిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. తమ కూతురు చేసింది క్షమించరానిదని.. ఆమెకు జీవించే హక్కులేదని.. ఇంకెవరైనా ఇలా చేసే ముందు వందసార్లు ఆలోచించేలా ఆమెను ఉరితీయాలని కోరుకుంటున్నట్లు ముస్తాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+