మిజోరం ఎన్నికలు : రెండుపూటల భోజనం.. పిల్లలకు విద్య సమకూరిస్తే చాలు..
మిజోరం రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ నెల 7 వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా అక్కడ ఎంతో కాలం నుంచి ఆశ్రయం పొందుతున్న మయన్మార్ శరణార్థుల మాటలు అందరిని ఆలోచించేలా చేసాయి. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, తాము గౌరవంగా బతికేలా రెండుపూటల భోజనం, మా పిల్లలకు మంచి విద్యను సమకూరిస్తే చాలని మయన్మార్ శరణార్థులు కోరుకుంటున్నారు. ఏ మనిషైనా తన జానెడు పొట్ట నిండడం కోసమే అహర్నిషలు శ్రమిస్తుంటాడు. అదే అదే మాట ఇక్కడి శరణార్థులు చెబుతున్నారు. తమ జానెడు పొట్ట నింపుకునేందు రెండు పూటల భోజనం, తమ పిల్లలకు సరైన విద్య సౌకర్యాలను కల్పిస్తే చాలని కోరుకుంటున్నారు.
31000 మందికి పైగా మయన్మార్ శరణార్థులు : ప్రస్తుతం మిజోరం రాష్ట్రంలో 31000 మందికి పైగా మయన్మార్ శరణార్థులు ఇక్కడ నివసిస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా మిజోరంలో ఆశ్రయం పొందిన శరణార్థులు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు మాత్రం నిత్యవసరాలను సమకూరిస్తే చాలు అని వారంటున్నారు. రెండేళ్ల కిందట మయన్మార్లో జరిగిన సైనిక తిరుగుబాటు కారణంగా వీరంతా ఇక్కడకు వచ్చిచేరారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇప్పటి ప్రభుత్వంలాగే తమకు కనీస అవసరాలు ఉపాధి పరంగా తమకు మద్దతు కొనసాగించాలని వారు కోరకుంటున్నారు. మణిపూర్ అల్లర్ల తర్వాత సుమారు పన్నెండు వేలమంది కుకీలు మిజోరంలోకి తరలివచ్చారు.

ఇందులో కొందరు తమ స్వస్థాలకు తిరిగి వెళ్లారు. మిగతావారికి ఇక్కడ ఉన్న ప్రస్తుత ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పిస్తోంది. 8119 మంది శరణార్థుల పిల్లలు ఇక్కడి రాష్ట్ర పాఠశాలల్లో చదువుకుంటున్నారు. స్థానిక పిల్లలతో పాటు వీరికి కూడా ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. మిజోరానికి సుమారు 58 కిలోమీటర్ల దూరంలో మయన్మార్ సరిహద్దు కలదు. ప్రస్తుతం ఇక్కడ తాత్కాలికంగా వెదురు కర్రలతో నిర్మించిన నివాసాల్లో మొత్తం 130 మంది శరణార్థులు సిహ్ముయి గ్రామ సమీపంలో నివాసముంటున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications