ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణం: మోడీ, నవీన్ పట్నాయక్ హాజరు
భువనేశ్వర్: ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రెండున్నర దశాబ్దాలుగా ఒడిశాను ఏలిన బీజేడీ పాలనకు ముగింపు పలుకుతూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మోహన్ చరణ్ మాఝీ. గవర్నర్ రఘుబర్ దాస్ బుధవారం ఆయన చేత ప్రమాణం చేయించారు. మోహన్తో పాటు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని జనతా మైదానంలో జరిగిన ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, తదితరులు హాజరయ్యారు.

మూడో గిరిజన సీఎంగా మాఝీ రికార్డుల్లోకెక్కారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ మాత్రమే ఒడిశాకు గిరిజన ముఖ్యమంత్రులుగా పనిచేయగా, ఇప్పుడు మాఝీ మూడో గిరిజన ముఖ్యమంత్రిగా నిలిచారు.
మోహన్ చరణ్ మాఝీ రాజకీయ ప్రస్థానం
#WATCH | Prime Minister Narendra Modi arrives at Janata Maidan, in Bhubaneswar.
— ANI (@ANI) June 12, 2024
Odisha CM-designate Mohan Charan Majhi, Deputy CMs-designate Kanak Vardhan Singh Deo & Pravati Parida and other ministers of the new government to take oath shortly. pic.twitter.com/VBbs2ASFI2
ఒడిశా ముఖ్యంమత్రిగా ఎన్నికైన మోహన్ చరణ్ మాఝీ ప్రముఖ గిరిజన నేత. ఆయన తండ్రి ఒక సెక్యూరిటీ గార్డుగానూ పనిచేసేవారు. ఆధ్యాత్మిక భావాలు గల మోహన చరణ్ మాఝీ విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సరస్వతీ విద్యామందిర్లో ఉపాధ్యాయునిగా పని చేశారు. ఆ తర్వాత న్యాయవాదిగా కొన్నిరోజులు పనిచేశారు.
అనంతరం 1997 నుంచి 2000 వరకు మాఝీ సర్పంచిగా పనిచేశారు. బీజేపీ గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన మాఝీ.. కేంఝర్ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు 2000, 2009, 2019, మళ్లీ 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 నుంచి 2024 వరకు శాసనసభలో బీజేపీ సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్ విప్గా విధులు నిర్వహించారు.
#WATCH | Bhubaneswar, Odisha: Outgoing CM Naveen Patnaik arrives at Janta Maidan to attend the swearing-in ceremony of CM-designate Mohan Charan Majhi. pic.twitter.com/oBjGXseYYy
— ANI (@ANI) June 12, 2024
కాగా, ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని పాలించిన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 78 చోట్ల గెలిచింది.
#WATCH | BJP leader Mohan Charan Majhi takes oath as the Chief Minister of Odisha, in Bhubaneswar. Governor Raghubar Das administers him the oath to office. pic.twitter.com/Xuv1MRsHcq
— ANI (@ANI) June 12, 2024
బిజు జనతా దళ్ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును చెప్పకుండానే ఎన్నికల్లో దిగిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను కైవసం చేసుకుంది. లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. మొత్తం 21 లోక్సభ స్థానాలకుగాను 20చోట్ల కాషాయ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం దక్కించుకుంది. అయితే, బీజేడీకి ఒక్కస్థానం కూడా దక్కలేదు.
-
కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications