ముగ్గురు కూతుళ్లను హత్య చేసి తల్లి ఆత్మహత్య
బెంగళూరు: కుటుంబ సమస్యల కారణంగా ముగ్గురు కుమార్తెలను హత్య చేసిన తల్లి తరువాత ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలో జరిగింది. ఆర్థిక సమస్యలతో ఒకే కుటుంబంలో నలుగురు ఈ విధంగా అసువులు బాయడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ముదోళ తాలుకా మహాలింగపురం పట్టణంలోని బావికట్టి ప్రాంతంలో మాన్వికి చెందిన రాజేశ్వరి (40) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు పుష్ప (19), సాధన (15), సహన (11) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం రాజేశ్వరికి వివాహం అయ్యింది.

తరువాత మహాలింగపురం వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. 10 సంవత్సరాల క్రితం తనకు ముగ్గురు కుమార్తెలు పుట్టారు. తాను పోషించలేనని రాజేశ్వరి భర్త ఇల్లు వదలి వెళ్లిపోయాడు. తరువాత అతను తిరిగి రాలేదు. అప్పటి నుండి రాజేశ్వరి కూలి పని చేస్తు బిడ్డలను పోషిస్తున్నది.
ముగ్గురు కుమార్తెల పోషణ భారం అయ్యింది. చుట్టు పక్కల ఉన్న ఆకతాయిలు అమ్మాయిలను వేధించడం మొదలు పెట్టారు. ఈ బాధలు తట్టుకొలేని రాజేశ్వరి శనివారం వేకువ జామున ముగ్గురు కుమార్తెల గొంతు బిగించి హత్య చేసింది. తరువాత ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications