సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి మండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ ఇంత వరకు మాజీ సీఎం కుమారస్వామి కోసం ప్రచారం చేయలేదు, మండ్యలో సుమలత అంబరీష్ ఎన్నికల ప్రచారం చెయ్యకపోవడంతో బీజేపీ నాయకులతో పాటు మాజీ సీఎం కుమారస్వామి హడలిపోతున్నారు.
ఇదే సమయంలో మైసూర్-కొడుగు లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి యదువీర్ వడయార్ కోసం సుమలత అంబరీష్ తీరికలేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శనివారం మైసూరు లోక్సభ నియోజకవర్గంలో మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత యదువీర్ తరపున జోరుగా ప్రచారం చేశారు. యదువీర్ వడయార్ చాలా సాధారణ వ్యక్తి, మీ అందరికీ సేవ చేయడానికి వచ్చారని, అందు కోసం ఆయనను గెలిపించి లోక్ సభకు పంపాలని సుమలత అంబరీష్ మైసూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మైసూరులోని కేఆర్ నియోజకవర్గంలో జరిగిన నారీశక్తి సమావేశంలో సుమలతా అంబరీష్ మాట్లాడుతూ నేను మండ్యలో పోటీ చేసినప్పుడు తనకు మహిళలు నాకు అండగా నిలిచారని, తనకు మైసూరు మధ్య విడదీయరాని సంబంధం ఉందని, అంబరీష్ ఇక్కడే చదువుకుని పెరిగి పెద్దవాడు అయ్యాడని, మేం చాలా సినిమా షూటింగ్ల కోసం ఇక్కడికి వచ్చేవాళ్లమని, ఇలాంటి అందమైన, సాంస్కృతిక నగరం ఎలా ఏర్పడింది? అంటే అది మీమంచి తనం అని సుమలత అంబరీష్ అన్నారు.
మైసూరు స్వాతంత్య్రానికి పూర్వం అభివృద్ధి చెందిన నగరమని, ఆధునిక నగర నిర్మాణానికి మైసూర్ మహారాజులు చేసిన కృషి అపారమని సుమలత గుర్తు చేశారు. మోదీ తన స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించలేదని, ప్రనిత్యం ప్రజల కోసం తపనపడే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని, ఆయన మన దేశ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారని, మహిళలకు ఎన్నో పథకాలు అందించారని, ఉజ్వల్ యోజనతో పాటు ఎన్నో పథకాలు అందించి మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా చేయూతనిచ్చారని సుమలత అన్నారు.
మోదీ మరోసారి ప్రధాని కావాలంటే బీజేపీకి ఓటు వెయ్యాలని సుమలత అంబరీష్ మనవి చేశారు. అయితే మైసూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సుమలత అంబరీష్ మండ్యలో ఎన్నికల ప్రచారం చెయ్యకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని జేడీఎస్ నాయకులు అంటున్నారు. బీజేపీ మీద ఒత్తిడి తీసుకువచ్చి సుమలతతో మండ్యలో ఎన్నికల ప్రచారం చేయించాలని మాజీ సీఎం కుమారస్వామి అనుకుంటున్నారని తెలిసింది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం











Click it and Unblock the Notifications