వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రెండ్‌షిప్ డే: ఒకే వేదికపై ములాయంతో అమర్ సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mulayam Appears With Amar Singh, Who he Expelled
లక్నో: పాత మిత్రులు మళ్లీ కలిశారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి నాలుగేళ్ల క్రితం బహిష్కరణకు గురైన అమర్ సింగ ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. లక్నోలో వారిద్దరూ ఒకే వేదిక మీదికి వచ్చారు. తీవ్రమైన మనస్పర్థలతో దూరమైన వీరిద్దరు ఆ తర్వాత కలుసుకోవడం ఇదే మొదటిసారి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా వారితో పాటు న్నారు. ములాయం సింగ్ యాదవ్ సోదరుడు రామ్ గోపాల్ యాదవ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

అమర్ సింగ్‌ను 2010 ఫిబ్రవరిలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి బహిష్కరించారు. ఆయనతో పాటు అప్పటి లోకసభ సభ్యురాలు జయప్రదను కూడా ఎస్పీ బహిష్కరించింది. సోషలిస్టు నేత జ్ఞానేశ్వర్ మిశ్రాకు అంకితం ఇచ్చిన లక్నోలోని పార్క్ ప్రారంభ కార్యక్రమానికి ములాయం అమర్ సింగ్‌ను ఆహ్వానించారు.

ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమమని, ములాయం సింగ్ ఆహ్వానంతో తాను ఇందులో పాల్గొంటున్నానని, తాను జ్ఞానేశ్వర్‌జీతో కలిసి పనిచేశానని, తాను ఆయనకు అనుచరుడినని అమర్ సింగ్ అన్నారు. అమర్ సింగ్‌కు బద్ధ శత్రువైన ఆజం ఖాన్ కూడా మంగళవారంనాడు జరిగిన ఈ కార్యక్రమానికి రాలేదు.

English summary
Amar Singh, who was expelled from the Samajwadi Party four years ago, shared the stage with party chief Mulayam Singh Yadav at an event in Lucknow today, signaling a rapprochement after a bitter political feud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X