ముంబైలో స్వల్పంగా పెరిగిన కేసులు.. ఫిబ్రవరి 1 తర్వాత ఇదే హై..
దేశంలో కరోనా కేసులు స్టేబుల్గానే ఉన్నాయి. ప్రస్తుతంం దేశంలో కేసుల తీవ్రత స్థిమితంగానే ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో స్వల్పంగా కేసులు పెరిగాయి. నిన్న పాజిటివిటీ రేటు 6 శాతం ఉండగా.. అదీ 8.40కి చేరింది. ముంబైలో కొత్తగా 739 కరోనా కేసులు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 1వ తేదీన 803 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.
కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో టెస్టుల సంఖ్యను కూడా పెంచుతారట. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ స్పస్టంచేసింది. వర్షాకాలం వస్తోన్న నేపథయంలో.. కేసుల సంఖ్యను పెంచుతామని తెలిపింది. అలాగే 12 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు. మిగతావారికి బూస్టర్ డోసు కూడా ఇస్తున్నారు.
ముంబైలో కేసులు స్వల్పంగా పెరగడంతో అందుకు బీఎంసీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో తగిన సౌకర్యాలు కల్పించనుంది. అలాగే ప్రైవేట్ దవాఖానాలను కూడా అలర్ట్ చేశారు. గతేడాది వేసవి అల్లాడించింది. దేశంలో కేసులు.. మరణాలు కూడా జరిగాయి. తర్వాత వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. అంతా టీకాలు తీసుకున్నారు. రెండు, బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. దీంతో కరోనా ప్రభావం లేదు. కానీ ముంబైలో పెరగడం మాత్రం కాస్త ఆందోళన కలిగించే అంశమే.. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.
కరోనా ఓకే.. కానీ మంకీ పాక్స్ వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికీ దేశంలో కేసులు లేకున్నా.. కేంద్ర వైద్యారోగ్యశాఖ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసింది. దీని లక్షణాలు కూడా కరోనా లాంటివే ఉన్నాయి.