‘రామ్ నామ్ సత్య్ హే’ అంటూ ముస్లింల నినాదాలు
భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఇది మన దేశంలో ఎప్పుడూ రుజువవుతూనే ఉంటుంది. తాజాగా ఇందుకు ఉదాహరణగా మరో ఘటన చోటు చేసుకుంది. కాలేయ కేన్సర్ వ్యాధితో మరణించిన ఓ హిందూ యువకుడికి ముస్లిములు హిందూ ధర్మం ప
మాల్దా: భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఇది మన దేశంలో ఎప్పుడూ రుజువవుతూనే ఉంటుంది. తాజాగా ఇందుకు ఉదాహరణగా మరో ఘటన చోటు చేసుకుంది. కాలేయ కేన్సర్ వ్యాధితో మరణించిన ఓ హిందూ యువకుడికి ముస్లిములు హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు జరిపారు.
అంతేగాక, అంత్యక్రియల సందర్భంలో రామ్ నామ్ సత్య్ హే అంటూ నినాదాలు కూడా చేయడం గమనార్హం. ఈ అరుదైన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాల్దా జిల్లా మాణిక్ చక్ బ్లాక్ పరిధిలోని షేక్పుర గ్రామానికి చెందిన బిశ్వజీత్ రజక్ అనే హిందూ యువకుడు కాలేయ కేన్సర్తో మరణించాడు.

నిరుపేద అయిన బిశ్వజీత్ అంత్యక్రియలు జరిపేందుకు సైతం అతని కుటుంబసభ్యుల వద్ద డబ్బులు లేవు. పెద్దగా బంధువులు కూడా లేరు. దీంతో ముస్లింలు అధికంగా నివాసముండే షేక్ పుర గ్రామంలో బిశ్వజీత్ ఇంటి పొరుగున ఉంటున్న ముస్లింలు ముందుకు వచ్చి అతనికి హిందూ ఆచారం ప్రకారం దగ్గరుండి అంత్యక్రియలు చేశారు.
వెదురు మంచంపై మృతదేహాన్ని ముస్లిమ్ లే ఎత్తుకొని 8 కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపించారు. శవ ఊరేగింపులో భాగంగా ముస్లిములే 'రామ నామ సత్య హై', 'బోలో హరి హరి బోలో' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడం విశేషం. హిందూ ధర్మం ప్రకారమే విశ్వజీత్ అంత్యక్రియలు పూర్తి చేయించారు ముస్లింలు.
ముస్లిములు చూపిన ఔదార్యంతో స్ఫూర్తి పొందిన మాల్దా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు గౌర్ మండల్ కూడా వారితో కలిసి బిశ్వజీత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హిందూ ముస్లిములు ఒక తల్లికి పుట్టిన ఇద్దరు కుమారులులాంటివారని, మనం ఒకరికి మరొకరు బాగా చూసుకోవాలని ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తి మన దేశమంతా విస్తరించాలని వారు ఆకాంక్షించారు. కాగా, విశ్వజీత్ ఆస్పత్రి ఖర్చులను కూడా పొరుగన ఉండే ముస్లిం సోదరులే భరించడం అభినందనీయం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications