వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగపూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్: భద్రత కట్టుదిట్టం

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శనివారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ రావడంతో కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

'మధ్యాహ్నం 1 గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. మహల్ ప్రాంతంలోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు' అని డీసీపీ జోన్ III గోరఖ్ భామ్రే తెలిపారు.

 Nagpur RSS Headquarter Receives Bomb Threat Call, Security Beefed Up

కాల్ వచ్చిన వెంటనే, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్), డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అయితే అనుమానాస్పదంగా ఏమీ లేదని డీసీపీ తెలిపారు.

పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం చుట్టూ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయగా, కాల్ చేసిన నంబర్‌ను ట్రాక్ చేయడం ప్రారంభించారు.

ఇదిలావుండగా, నూతన సంవత్సర వేడుకలతో సహా మెగాపోలిస్‌లోని కొన్ని ప్రదేశాలలో బాంబు పేలుళ్లకు బెదిరింపులకు పాల్పడినందుకు ముంబై నుంచి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

శుక్రవారం రాత్రి 8:56 నుంచి 9.20 గంటల మధ్య పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసిన నిందితుడు నరేంద్ర కవాలేను సెంట్రల్ ముంబైలోని ధారవి నుంచి అరెస్టు చేశారు. మద్యం మత్తులో కవాలే కాల్ చేశారని కూడా ఆయన చెప్పారు.

English summary
Nagpur RSS Headquarter Receives Bomb Threat Call, Security Beefed Up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X