జార్ఖండ్లో రెచ్చిపోయిన మావోయిస్టులు .. 11 మంది జవాన్లకు గాయాలు
జార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఐఈడీ పేల్చడంతో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో 8మంది కోబ్రా కమాండోలు ఉండగా.. ముగ్గురు జార్ఖండ్ పోలీసులు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్ సాయంతో రాంచీ హాస్పిటల్కు తరలించారు.
జార్ఖండ్ పోలీసులు, 209 కోబ్రా బెటాలియన్కు చెందిన సిబ్బంది జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోలు బాంబు దాడి చేశారు. శక్తివంతమైన బాంబు కావడంతో పలువురు జవాన్లకు గాయాలయ్యాయి. బాంబు దాడి అనంతరం మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో మావోలు ఘటనాస్థలం నుంచి పారిపోయారు. వారి కోసం భద్రతాబలగాలు వేట కొనసాగిస్తున్నాయి.
Jharkhand: An IED exploded at 4:53 am today in Kuchai area of Saraikella on the troops of 209 CoBRA and Jharkhand police who were out on special operations. 8 CoBRA personnel & 3 Jharkhand police personnel injured. The injured jawans have been brought to a hospital in Ranchi. pic.twitter.com/rO31QkbAXc
— ANI (@ANI) May 28, 2019