వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు .. 11 మంది జవాన్లకు గాయాలు

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్‌కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఐఈడీ పేల్చడంతో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో 8మంది కోబ్రా కమాండోలు ఉండగా.. ముగ్గురు జార్ఖండ్ పోలీసులు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్ సాయంతో రాంచీ హాస్పిటల్‌కు తరలించారు.

జార్ఖండ్ పోలీసులు, 209 కోబ్రా బెటాలియన్‌‍కు చెందిన సిబ్బంది జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోలు బాంబు దాడి చేశారు. శక్తివంతమైన బాంబు కావడంతో పలువురు జవాన్లకు గాయాలయ్యాయి. బాంబు దాడి అనంతరం మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో మావోలు ఘటనాస్థలం నుంచి పారిపోయారు. వారి కోసం భద్రతాబలగాలు వేట కొనసాగిస్తున్నాయి.

Naxals trigger IED blast in Saraikela, 11 security personnel injured

English summary
Eleven personnel of CRPF, state police were injured on Tuesday morning in an IED blast in Kuchai area of Saraikella, Jharkhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X