దారుణం: నైజీరియన్ మహిళపై కదులుతున్నఆటోలో..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నైజీరియన్ మహిళ పైన కదులుతున్న ఆటోలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడైన డ్రైవర్ వయస్సు 45 ఏళ్లు ఉంటుంది.
ఈ సంఘటన ఢిల్లీలోని షాపురా ప్రాంతంలో జరిగింది. 45 ఏళ్ల నైజీరియా మహిళపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సదరు మహిళ షాపురాలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లాలని ఓ ఆటోలో ఎక్కింది.
మరో ఆటో డ్రైవరు వచ్చి ఆమె వెనుకనే కూర్చున్నాడు. మార్గం మధ్యలో వారు ఆమెను లైంగికంగా వేధించారని, తర్వాత ఆమెను ఆటో నుంచి తోసేశారని, ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు.
ఇద్దరు నిందితుల్లో ఆగ్యాపాల్ను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం నాడు చెప్పారు. అతని సోదరుడు బల్జీత్ కోసం గాలిస్తున్నారు. నిందితులు ఇద్దరు ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. బాధితురాలిని చికిత్స కోసం డిడియు ఆసుపత్రికి తరలించారు.