నైజీరియన్లతో పెద్ద సమస్య ఉంది: గోవా సీఎం
గోవా: పర్యాటకులతో నిత్యం కిటకిటలాడే గోవాలో నైజీరియన్ల ఆగడాలకు అంతులేకుండా పోతుందని, వాళ్ల వ్యవహారం తమకు పెద్ద తలనొప్పిగా తయారైయ్యిందని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీ కాంత్ పర్సేకర్ చెప్పారు.
గోవాకు అనేక దేశాల నుంచి ప్రతి రోజు వేలాధి మంది పర్యాటకులు వస్తుంటారని, అయితే వారితో గోవా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని, కేవలం నైజీరియన్లు చేస్తున్న అల్లరి వలన గోవా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

గోవా ప్రజలు ఎక్కువగా నైజీరియన్ల మీదే ఫిర్యాదు చేస్తున్నారని ముఖ్యమంత్రి లక్ష్మీ కాంత్ పర్సేకర్ చెప్పారు. నైజీరియన్ల ప్రవర్తన, వారి జీవన శైలితో గోవా ప్రజలు విసిగిపోయారని పర్సేకర్ తెలిపారు.
పనజికి 20 కిలో మీటర్ల దూరంలోని ఓ గ్రామంలో 30 ఏళ్ల మహిళ మీద నైజీరియా జాతీయుడు అత్యాచారం చేశాడని గుర్తు చేశారు. పోలీసులు అతనిని అరెస్టు చేశారని చెప్పారు. నైజీరియన్లు ఎదో ఒక కేసు పెట్టించుకుని భారత్ లో చాల కాలం ఉండిపోవాలని ప్రయత్నిస్తున్నారని, వారిని అరికట్టడానికి త్వరలో డిపోర్టు చేసేయాలని గోవా పర్యాటక శాఖ మంత్రి దిలీప్ చెప్పారు.












Click it and Unblock the Notifications