ఇంటి పై కప్పు కూలి 9 మంది సజీవ సమాధి
లక్నో: ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకునింది. ఇంటి పై కప్పు కుప్ప కూలిపోవడంతో ఒకే కుటుంబంలోని తొమ్మిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్ లోని బాందా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయారు. అర్దరాత్రి ఒక్క సారిగా ఇంటి పై కప్పు కుప్పకూలిపోయింది. గాఢనిద్రలో ఉన్న తొమ్మిది మంది సంఘటనా స్థలంలో సజీవ సమాధి అయ్యారు.

తీవ్రగాయాలైన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఇల్లు చాలా సంవత్సరాల క్రితం నిర్మించారని, ఇంటి మరమత్తులు చెయ్యమని ఎన్ని సార్లు చెప్పినా ఇంటి యజమాని పట్టించుకోలేదని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గత కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు రావడంతో ఇల్లు పూర్తిగా తడిసిపోయిందని, అందు వలనే ఇంటి పై కప్పు కూలి తొమ్మిది మంది మరణించారని పోలీసులు చెప్పారు. ఇంటి యజమాని పరారైనాడని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications