వారిని ఎవరూ చంపలేదు, వాళ్లంత వాళ్లే చనిపోయారు: సోహ్రబుద్దీన్ కేసు తీర్పుపై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: హరేన్ పాండ్యా, తులసీరామ్ ప్రజాపతి, జస్టిస్ లోయ, ప్రకాశ్ థోంబ్రే, శ్రీకాంత్ ఖండేల్కర్, కౌసర్ బి, సోహ్రబుద్దీన్ షేక్.. వీరిని ఎవరూ చంపలేదని, వారే చనిపోయారని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శనివారం నాడు ట్వీట్ చేశారు.
పదమూడేళ్లనాటి సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు నిందితులందరూ నిర్దోషులేనని స్పెషల్ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ వ్యంగ్యస్త్రం విసిరారు.

సొహ్రాబుద్దీన్, అతడి ఎన్కౌంటర్ కేసుతో సంబంధమున్న వారిని ఎవరూ చంపలేదని వారే చనిపోయారని పేర్కొన్నారు. 'ఎవరూ చంపబడలేదు. హరేన్ పాండ్యా, తులసీరామ్ ప్రజాపతి, జస్టిస్ లోయా, ప్రకాశ్ తొంబ్రే, శ్రీకాంత్ ఖండాల్కర్, కౌసర్ బీ, సోహ్రాబుద్దీన్ షేక్.. వారికి వారే చనిపోయారు' అని ట్వీట్ చేశారు.
సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో 21మంది పోలీసు అధికారులు సహా మొత్తం 22 మందీ నిర్దోషులేనని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో మొత్తం 210 మంది సాక్షులను విచారించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను 2010లో అరెస్ట్ చేశారు. 2014 డిసెంబర్లో ఈ కేసు నుంచి ఆయన బయటపడ్డారు. ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా అనుమానాస్పదస్థితిల్లో మృతి చెందడం అనుమానాలకు తావిచ్చింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications