గోమాంసంతో విందు: కాశ్మీర్ ఎమ్మెల్యేపై సిరా దాడి
న్యూఢిల్లీ: గోమాంసంతో డిన్నర్ ఇచ్చానని ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ్యుడదు ఇంజనీర్ రషీద్పై సిరాతో దాడి జరిగింది. ఢిల్లీ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన రషీద్పై ఇద్దరు యువకులు సోమవారంనాడు ఈ దాడి జరిపారు.
గోవు తమకు మాత వంటిదని తమ సెంటిమెంట్ను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకే ఇంకుతో దాడి చేశామని వారు చెప్పారు. విష్ణు గుప్తా నాయకత్వంలోని హిందూ సేనకు చెందినవారు తామే దాడి చేశామని చెప్పుకున్నారు.

పోలీసులు వచ్చి యువకులను అదుపులోకి తీసుకున్నారు. తనపై ఇంకు దాడి జరిగినంత మాత్రాన తాను వెనుకడుగు వేసేదిలేదని రషీద్ అన్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గోవు మాంసంతో డిన్నర్ ఇచ్చానని చెప్పినందుకు బిజెపి ఎమ్మెల్యే రషీద్పై అసెంబ్లీలోనే దాడి చేసి చెంప పగలకొట్టారు.
బిజెపి శాసనసభ్యుల నుంచి రషీద్ను రక్షించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెసు శాసనసభ్యులు ఆ సమయంలో ప్రయత్నించారు. నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని జమ్మూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వివాదం ప్రారంభమైంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications