అనూహ్య మలుపు: సీఎంగా పళనిస్వామి, పన్నీరుసెల్వం మద్దతు
అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి పదవి అంశం ట్విస్ట్ల మీద ట్విస్టులు కొనసాగుతోంది. తాజాగా, ముఖ్యమంత్రి పదవికి అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎంపిక చేసిన పళని స్వామికి దక్కనుంది.
చెన్నై: అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి పదవి అంశం ట్విస్ట్ల మీద ట్విస్టులు కొనసాగుతోంది. తాజాగా, ముఖ్యమంత్రి పదవికి అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎంపిక చేసిన పళని స్వామికి దక్కనుంది. అనూహ్యంగా ఆయనకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పళని స్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ విషయాన్ని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ పన్నీరు సెల్వం మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేకపోయరు.

తొలుత అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా శశికళ ఎన్నికయ్యారు. అప్పుడే పన్నీరు రాజీనామా చేశారు. రెండు రోజుల తర్వాత అనూహ్యంగా పన్నీరు.. శశికళపై తిరుగుబావుటా ఎగురవేశారు. అప్పటి నుంచి ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
రెండు రోజుల క్రితం అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడింది. దీంతో పన్నీరుకు చెక్ చెప్పేందుకు శశికళ ముఖ్యమంత్రిగా తెరపైకి పళనిస్వామిని తీసుకు వచ్చారు.
ఇప్పుడు శశికళకు మద్దతు పలుకుతున్న మెజార్టీ ఎమ్మెల్యేలు.. ఆమె సూచించిన పళనిస్వామి వైపు ఉన్నారు. పన్నీరు సెల్వం వైపు ఎమ్మెల్యేలు వస్తున్నారని.. వరుసగా ప్రచారం సాగుతోంది. కానీ పదిమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన వైపు లేనట్లుగా కనిపిస్తోంది.
మరోవైపు, ప్రభుత్వాన్ని ఏర్పాుట చేసేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు పళని స్వామికి ఉంది. దీంతో ఆయన ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను చూపించారు. ఈ నేపథ్యంలో పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. పళని స్వామి ముఖ్యమంత్రిగా అయితే పన్నీరు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications