శబరిమలలో మళ్లీ టెన్షన్..! పంబలో భారీగా పోలీస్ బలగాలు
కేరళ : శబరిమల ఆలయం దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయ్యప్ప దర్శనానికి మహిళలు తరలిరావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొంతమంది మహిళలు పంపా బేస్ కార్యాలయం దగ్గరకు చేరుకోవడంతో అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మరోవైపు పంబలో పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. కొట్టాయం రైల్వే స్టేషన్ సమీపంలో మహిళలు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.

అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈనెల 27 వరకు ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ పొడిగించారు. ఇళావుంగల్ సన్నిధానం మార్గంలో గ్రూపులు గ్రూపులుగా ఉండొద్దని హెచ్చరించారు. అదలావుంటే ఆలయ కార్యకలాపాలు పర్యవేక్షించడానికి ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది హైకోర్టు. ఈ కమిటీ నివేదికను అమలు చేయనుంది కేరళ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications