‘నోటివెంట మాట రాలేదు! కాశ్మీరీలు సిగ్గుతో తలదించుకోవాలి’
అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ముస్లీంలకు, కాశ్మీరీలకు మచ్చ తీసుకొచ్చిందన్నారు.
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ముస్లీంలకు, కాశ్మీరీలకు మచ్చ తీసుకొచ్చిందన్నారు. అంతేగాక, ఈ ఘటనతో ప్రతీ కాశ్మీరీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఉగ్రవాదుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న యాత్రికులను సీఎం మెహబూబా ముఫ్తీ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతీ సంవత్సరం అనేకమంది కాశ్మీర్కు వస్తున్నారని చెప్పారు.

అయితే, ఈసారి ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని.. ఈ ఘటనపై సమాచారం అందగానే తనకు నోటి వెంట మాటరాలేదని అన్నారు ముఫ్తీ. దాడికి పాల్పడిన వారిని పోలీసులు త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకముందని తెలిపారు.
జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్నాథ్ యాత్రికులపై లష్కరే తొయిబా ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో ఏడుగురు మరణించగా, 11మంది గాయపడ్డారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications