Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

oYo సీఇవో మీద 420 కేసు, మాజీ సైనికుడికి మోసం!, రూ. కోటి, రెడ్డి అండ్ కో!

బెంగళూరు: ఆన్ లైన్ ద్వారా హోటల్స్ అండ్ హోమ్స్ బుక్ చేస్తున్న ఓయో (oYo)అప్లికేషన్స్ వ్యవస్థాపకుడు, సీఇవో మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ సీఇవో రితీష్ అగర్వాల్ మీద, ఆ కంపెనీకి చెందిన ఇద్దరు ప్రతినిధుల మీద 406, 420 కేసులు నమోదు చేశామని బెంగళూరు నగర పోలీసులు తెలిపారు.

బెంగళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ లో బీఇఎంఎల్ లేఔట్ లో రాజ్ గురు శెల్టర్ హోటల్ ఉంది. రాజ్ గురు శెల్టర్ హోటల్ యజమాని, మాజీ సైనికుడు నటరాజన్ వీఆర్ఎస్ ఓయో కంపెనీ యాజమాన్యం మీద ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

oYo CEO Ritesh Agarwal booked on cheating case in Bengaluru

2017 జూన్ లో ఓయో కంపెనీతో తమకు అగ్రిమెంట్ అయ్యిందని రాజ్ గురు శెల్టర్ హోటల్ యజమాని నటరాజన్ అంటున్నారు. ఓయో 20 శాతం పెట్టుకుని మిగిలిన 80 శాతం చెల్లిస్తామని అగ్రిమెంట్ లో ఉందని, అయితే బెంగళూరు ప్రతినిధులు ఆనంద్ రెడ్డి, ప్రతీక్ సింగ్ 80 శాతం వాళ్లు పెట్టుకుని 20 శాతం మాత్రమే తమకు చెల్లించారని హోటల్ యజమాని నటరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓయో కంపెనీ ప్రతినిధులు ఈ రకంగా తమకు సుమారు రూ. ఒక కోటి వరకు మోసం చేశారని, తమకు న్యాయం చెయ్యాలని నటరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటరాజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వైట్ ఫీల్డ్ పోలీసులు ఓయో కంపెనీ సీఇవో రితేష్ అగర్వాల్, కంపెనీ ప్రతినిధులు ఆనంద్ రెడ్డి, ప్రతీక్ సింగ్ మీద ఐపీఎస్ 406, 420 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వైట్ ఫీల్డ్ పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+