పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. 45 మందికి పద్మశ్రీ

జనవరి 26, రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఏకంగా 45 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందిస్తున్నట్లు తెలిపింది. వీరిలో ఎస్‌. జి. సుశీలమ్మ, మామిడి రామారెడ్డి, అంకె గౌడ, అర్మిడ ఫెర్నాండెజ్, భగవాన్‌ దాస్ రైకర్‌, శ్యామ్‌ సుందర్, చిరంజి లాల్‌ యాదవ్‌, ఇంద్రజీత్‌ సింగ్‌ కు పద్మశ్రీ ప్రకటించింది కేంద్రం.

జనవరి 26 గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2026 ఏడాదికి గాను ఈ లిస్టును తాజాగా ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. వీరిలో తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డు వరించింది. పాడి, పశుసంవర్ధక విభాగాల్లో మామిడి రామరెడ్డి చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారం ప్రకటించింది. ఇక తమిళనాడుకు చెందిన నటేశన్, హైదరాబాద్ లోని సీసీఎంబీలో పని చేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‍ కు జన్యు సంబంధ పరిశోధనలకు గాను పద్మశ్రీ అవార్డు వరించింది.

PadmaAwards Central Govt Announces 45 Honoured with Padma Shri for Exceptional Contribution

ఇక పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వారి వివరాలు చూస్తే.. ఎస్ జీ సుశీలమ్మ, మామిడి రామారెడ్డి, శ్యామ్ సుందర్, చిరంజి లాల్ యాదవ్, ఇంద్రజీత్ సింగ్, రఘువత్ సింగ్, ఆర్. కృష్ణన్, పద్మ గుర్మిత్, అంకె గౌడ, ఆర్మిడ ఫెర్నాండెజ్, భ్రిజ్ లాల్ భట్, భగవాన్ దాస్ రైకర్,టెక్కీ గుబిన్, సురేష్ హనగవాడి, సిమాంచల్ పాత్రో, విశ్వ బంధు, శ్రీరంగ్ దేవబ లాడ్, కాలియప్ప గౌండర్,పోఖిల లేఖేపి, నూరుద్దీన్ అహ్మద్, నరేష్ చంద్ర దేవ్ వర్మ తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+