సిబిఎస్ఈ పేపర్ లీక్: నాలుగు గంటలు విచారణ, వేయి మందికి చేరిందా?
Recommended Video

న్యూఢిల్లీ: సిబిఎస్ఈ పరీక్షల కంట్రోలర్ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నాలుగు గంటల పాటు విచారించింది. లీకైన పేపర్ వేయి మందికి చేరినట్లు భావిస్తున్నారు. ప్రశ్నపత్రాలు లీకైన రెండు పరీక్షల తేదీలను సోమవారం లేదా మంగళవారం ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్ర ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.
పిల్లల కోసం తాము పనిచేస్తున్నామని, పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని సిబిఎస్ఈ చైర్ పర్సన్ అనిత కార్వాల్ చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పిల్లలకు అనుకూలంగానే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

సిబిఎస్ఈ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 35 మందిని ప్రశ్నించారు. వారిలో ఓ కోచింగ్ సెంటర్ (వికీ), 11 మంది విద్యార్థులు, 7గుు ప్రథమ సంవ్సంర విద్యార్థులు, ఐదుగురు ట్యూటర్లు, ఇద్దరు ప్రైవేట్ అధికారులు ఉన్నారు.
వారందరికీ లీకైన ప్రశ్నప్రతం అందినట్లు తెలుస్తోంది. పదో తరగతి లెక్కల పరీక్షకు ముందు రోజు మార్చి 27వ తేదీన ప్రశ్న పత్రం లీకైనట్లు సిబిఎస్ఈకి ఓ ఈమెయిల్ వచ్చింది. పేపర్ లీక్పై పోలీసు కంట్రోల్ రూంకు కూడా ఓ కాల్ వచ్చింది.












Click it and Unblock the Notifications