సంచీలో మృత కవలలను ఇచ్చిన ఆస్పత్రి: ఒక్కరు సజీవమే
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆస్పత్రి మరణణించిన కవలలు జన్మించారని ఢిల్లీలోని ఆస్పత్రి మృతదేహాలంటూ ఇచ్చింది. అయితే, వారిలో ఒకరు బతికే ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. మరణించారని సమాధి చేయబోయే సమయంలో ఆ విషయం తెలిసింది
కవలలు గురువారం జన్మించారు. వారు మరణించారని సంచీలో పెట్టి ఆస్పత్రి వర్గాలు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన ఢిల్లీ షాలిమార్ బాగ్ మాక్స్ ఆస్పత్రిలో జరిగింది. అయితే, సమాధి చేయడానికి బయలుదేరిన తల్లిదండ్రులు అందులో ఒక్కరు బతికి ఉన్నట్లు గుర్తించరు.
వెంటనే కుటుంబ సభ్యులు కాశ్మీరీ గేట్ ప్రాంతంలో గల ఓ ఆస్పత్రికి హుటాహుటిన వెళ్లి శిశువు బతికి ఉన్న విషయాన్ని చెప్పారు. కవలలను పరీక్షించిన వైద్యులు కవలల్లో ఒక శిశువు మరణించినట్లు, మరో శిశువుకు కీలకమైన వైద్య చికిత్స అవసరమని చెప్పారు.
బతికి ఉన్న శిశువును కొన్ని రోజుల పాటు నర్సరీలో పెట్టాలని వైద్యులు సూచించారు ఈ రెండో శిశువు మరో ఆస్పత్రిలో కోలుకుంటోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడ్ని సెలవులో పంపినట్లు మాక్స్ అధికారులు చెప్పారు.