Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు మరింత తీవ్రతరం చేశఆరు. మంగళవారం ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన రాజస్థాన్లో చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మరోమారు వివాదాస్పదమైన మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మత స్వేచ్ఛ ఉండదని చెప్పిన ప్రధాని మోదీ ప్రజల సంపదను కొన్ని సెలెక్టివ్ వర్గాలకు మాత్రమే పంచేందుకు కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవే వ్యాఖ్యలు రాజస్థాన్లోని బన్స్వారాలో జరిగిన సభలో కూడా చేశారు. ప్రజల సంపదపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ కూటమి పార్టీలు తనను తిట్టే కార్యక్రమం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓ కుట్రకు తెరతీస్తోందన్న వాస్తవాన్ని దేశప్రజల ముందు ఉంచానని టాంక్లో జరిగిన ర్యాలీలో మోదీ చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న కుటిల రాజకీయాలను మూడురోజుల క్రితమే తాను బహిర్గతం చేసినట్లు చెప్పిన ప్రధాని.. కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. అంతేకాదు కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై కూడా ఘాటు విమర్శలు చేసిన ప్రధాని మోదీ ఆ పార్టీ తన విధానాలను ఎందుకు దాచి ఉంచుతోందని ప్రశ్నించారు. దేశంలోని సంపదపై సర్వే చేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేసిన మోదీ.. సంపదను రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారన్న విషయాన్నే తాను ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.

తాను ఎప్పుడైతే కాంగ్రెస్ రహస్యాన్ని బయటపెట్టాడో... లోలోపల దాగిన అసలు కాంగ్రెస్ అజెండా బయటపడిందని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలకు చెమటలు పడుతున్నాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో మనకిష్టమొచ్చిన దైవాన్ని కొలిచే స్వేచ్ఛ ఉండదని చెప్పారు. హనుమాన్ ఛాలీసా విన్నాకూడా అదేదో నేరం కింద పరిగణించే పరిస్థితులు వస్తాయని జోస్యం చెప్పారు ప్రధాని మోదీ.దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఘనంగా జరుపుకుంటున్న వేళ మోదీ కామెంట్స్ హాట్ టాపిక్గా నిలిచాయి.
రాజస్థాన్లో సంతానం గురించి మాట్లాడుతూ పరోక్షంగా ముస్లిం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన ప్రధాని మోదీపై తెలంగాణ ఎమ్మెల్యే మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. కేవలం ముస్లిం కుటుంబాల్లోనే సంతానం ఎక్కువగా ఉందా అని ప్రశ్నించిన అక్బరుద్దీన్... మోదీ, అమిత్ షా, యోగీ ఆదిత్యనాథ్లకు ఎంతమంది అక్క చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు ఉన్నారో తెలుసా అని ప్రశ్నించారు. బీజేపీ మోదీ తమ రాజకీయ స్వలాభం కోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అక్బరుద్దీన్ మండిపడ్డారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications