కశ్మీర్లో కొత్త చరిత్ర, నెరవేరిన వందేళ్ల కల - మోదీ ఖాతాలో మరో మైలురాయి.!!
జమ్ము కాశ్మీర్ లో వందేళ్ల కల నెరవేరింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన ను ప్రధాని మోదీ ప్రారంభించారు. బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్ లో తొలి సారి పర్యటనకు వచ్చారు. ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వేలింక్ ప్రాజెక్టులో భాగంగా చినాబ్ వంతెన నిర్మాణం చేశారు. దీనిని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో నిర్మించారు. వాస్తవానికి ఈ చీనాబ్ రైల్వే వంతెన 359 మీటర్ల ఎత్తు, 1,315 మీటర్ల పొడవుతో కలిగి ఉంది. దీని వల్ల జమ్మూ-శ్రీనగర్ మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది.
జమ్మూకశ్మీర్లో చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ అట్ట హాసంగా ప్రారంభించారు.ఇది ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్ల ఎత్తు ఉంటుంది. ఇక ప్యారిస్లోని ప్రపంచ వింత అయిన ఈఫిల్ టవర్ను కూడా తలదన్నేలా ఈ చినాబ్ రైల్వే వంతెన ఉంటుంది. చినాబ్ నదిపై నిర్మితమైన ఈ వంతెనను భారతీయ రైల్వే చరిత్రలో ఇంజినీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు. పర్వతాలను చీల్చుకుంటూ, లోయలను దాటుకుంటూ ఎన్నో వంతెనలు, సొరంగాల ద్వారా ప్రయాణికులను గమ్యానికి చేరుస్తుంది ఈ రైల్వే లైన్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్క్ బ్రిడ్జ్. గంటకు 266 కి.మీ వేగంతో గాలులు వీచినా వంతెన చెక్కుచెదరదు. ఈ రైల్వే బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో కట్రా - శ్రీనగర్ మధ్య 3 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది.

ప్రధాని మోదీ శుక్రవారం జమ్మూకశ్మీర్లోని కట్రాలో రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్లనకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత చినాబ్ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న ప్రధాని వ్యూ పాయింట్ నుంచి వంతెనను పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను అధికారులు ఫొటో ప్రజంటేషన్ ద్వారా మోదికి వివరించారు. ఐకానిక్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజియంను ప్రధాని సందర్శించారు. ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లు, కార్మికులతో కూడా ప్రధాని ముచ్చటించారు. కట్రా-శ్రీనగర్, కశ్మీర్-కట్రా వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు.












Click it and Unblock the Notifications