Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయోధ్య తీర్పు: ఇది ఏ ఒకరి విజయమో, పరాజయమో కాదు, ప్రధాని మోడీ

అయోధ్య తుది తీర్పును మరికొన్ని గంటల్లో సుప్రీంకోర్టు వెలువరించనుండంతో ప్రధాని మోడీ స్పందించారు. భారత న్యాయవ్యవస్థపై సముచిత గౌరవం ఉంచుదామని ట్వీట్ చేశారు. సమాజంలోని అన్ని వర్గాలు, సామాజిక ఆర్థిక వర్గాలు, అన్నీ పార్టీలు కూడా సంయమనం పాటించాలని కోరారు. ఇదివరకు హింసను ప్రేరేపించిన వారు కూడా సంయమనంగా ఉండాలని కోరారు. అయోధ్య వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిన మనమంతా కట్టుబడి ఉండాలన్నారు. సంయమనంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అయోధ్య భూ వివాదానికి సంబంధిచిం సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా మనమంతా స్వాగతించాలని కోరారు. ఇది ఏ ఒకరి విజయమో, పరాజయమో కాదని పేర్కొన్నారు. దేశంలో ప్రజలందరు సంయమనంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. తమ సాంప్రదాయాన్ని, శాంతి, సామరస్యాన్ని కొనసాగించి దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని కోరారు. మనమంతా ఐకమత్యంగా ఉండి దేశానికి మరింత మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

pm modi on Ayodhya verdict

అయోధ్య భూ వివాదం గత కొన్నేళ్లుగా సాగుతుంది. దీనిపై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై కక్షిదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో చాలా పిటిషనర్లు ఇంప్లీడ్ అయ్యారు. భూ వివాదం పరిష్కారం కోసం కమిటీని కూడా నియమించారు. తర్వాత 40 రోజులపాటు సుప్రీంకోర్టు వాదనలు అలకించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విమరణ చేయనున్న నేపథ్యంలో తీర్పు వెలువరిస్తామని సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు 9వ తేదీన శనివారం తీర్పునిస్తామని స్పష్టంచేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+