Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భోగి స్పెషల్ : పొంగలి వండిన ప్రధాని మోదీ

సంక్రాంతి పండుగను ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. భారతదేశం అంతటా ఈ పండుగను వివిధ పేర్లతో, రక రకాలుగా జరుపుకుంటున్నారు. ఉత్తర భారత దేశంలో 'మకర సంక్రాంతి' పేరుతో గంగా స్నానాలు, దానధర్మాలు నిర్వహిస్తుంటారు. పంజాబ్, హర్యానాలో 'లోహ్రి' పండుగను మంటలు వేసి, పాటలు పాడుతూ సెలబ్రేట్ చేస్తున్నారు. అస్సాంలో 'బిహు' పేరుతో కొత్త పంటను ఆహ్వానిస్తుండగా.. గుజరాత్‌లో 'ఉత్తరాయణ్' పేరిట ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోయింది. పేరు ఏదైనా, దేశవ్యాప్తంగా రైతుల కష్టాన్ని గౌరవించడం, ప్రకృతిని ఆరాధించడం ఈ పండుగ ప్రధాన ఉద్దేశంగా చెప్పొచ్చు.

ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు 'భోగి' పండుగతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలందరూ తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. పాత సామాగ్రిని మంటల్లో వేసి, తమలోని చెడు ఆలోచనలను తొలగించుకుని కొత్త జీవితానికి ఆహ్వానం పలికారు. అలానే లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో, హరిదాసుల కీర్తనలతో, గంగిరెద్దుల ఆటలతో కళకళలాడుతున్నాయి.

pm-modi-participated-and-cook-pongal-at-bhogi-event

ఈ క్రమంలోనే ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో నిర్వహించిన సంప్రదాయబద్ధమైన పొంగల్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా తమిళ ప్రజలకు పొంగల్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు తనదైన శైలిలో గౌరవం తెలియజేస్తూ, ప్రధాని స్వయంగా గోవులకు పూజలు నిర్వహించి, పొంగలి వండి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కేంద్ర మంత్రులు, ప్రముఖుల హాజరు

ఈ పొంగల్ వేడుకల్లో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు సహా పలువురు ఎంపీలు, ప్రముఖ నేతలు, సాంస్కృతిక రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. సంప్రదాయ వేషధారణ, తమిళ సాంస్కృతిక వాతావరణం ఈ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. దేశ రాజధానిలో తమిళ సంస్కృతి ఘనంగా ఆవిష్కృతమవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
దేశ అభివృద్ధిలో రైతులు అత్యంత కీలక భాగస్వాములని ప్రధాని పునరుద్ఘాటించారు. రైతులను ఆర్థికంగా, సాంకేతికంగా శక్తిమంతం చేయడమే ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతి, వ్యవసాయం విడదీయరాని బంధమని పేర్కొంటూ, పొంగల్ వంటి పండుగలు రైతుల కష్టానికి గౌరవ సూచకంగా నిలుస్తాయని మోదీ వ్యాఖ్యానించారు.

వేడుకల అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత ఏడాది తాను తమిళనాడులో పాల్గొన్న పలు కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన గంగైకొండ చోళపురం ఆలయం, అలాగే దేశానికి గర్వకారణమైన పంబన్ వంతెన ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా తమిళుల గొప్ప చరిత్ర, వారసత్వాన్ని మరింత లోతుగా తెలుసుకునే అవకాశం కలిగిందని ఆయన తెలిపారు. కొన్ని నెలల క్రితం తమిళనాడులో నిర్వహించిన సహజ వ్యవసాయ సదస్సుకు తాను హాజరయ్యానని తెలిపారు.

మంచి ఉద్యోగాలు, లాభదాయక వృత్తులను వదిలి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన యువతను కలవడం తనకు ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు. వారి కృషిని మరింత విస్తరించి, వ్యవసాయంలో కొత్త విప్లవం తీసుకురావాలనే సంకల్పం తనకు కలిగిందని చెప్పారు. వ్యవసాయాన్ని స్థిరంగా, పర్యావరణ అనుకూలంగా మార్చడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం, ఆధునిక సాంకేతికతలు, డిజిటల్ సొల్యూషన్లు రైతులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దీంతో పాటు రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు దిశగా విధానాలు అమలు చేస్తున్నామని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+