ఇంకా సహనం ఎందుకు?: మోడీపై శివసేన
ముంబై: ఉగ్రవాద ఘటనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంకా సహనంగా ఉండటానికి ముగింపు చెప్పాలని శివసేన పార్టీ సూచించింది. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆ పార్టీ పై విధంగా స్పందించింది.
తన పత్రిక సామ్నాలో ఈ మేరకు పార్టీ సంపాదకీయాన్ని రాసింది. పఠాన్కోట్ దాడి లాంటి ఘటనలపై ప్రధాని మోడీ స్పందించాలని, దేనికైనా హద్దులు ఉంటాయని రాసింది. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనల పట్ల దేశం చాలా సహనంగా ఉంటూ వచ్చిందని తెలిపింది.

పఠాన్కోట్ విషయంలో అమెరికా ఇప్పటికే పాకిస్థాన్పై ఒత్తిడి తెస్తోందని పేర్కొంది. ‘ఇప్పుడు బంతి పాకిస్థాన్ కోర్టులో ఉండటంతో ఏం జరుగుతుందో చూడాలి' అదొక్కటే మన చేతుల్లో ఉందని శివసేన పేర్కొంది.
ఈ దాడికి ప్రతిగా గట్టి సమాధానం ఇవ్వాలని సూచించింది. ఇప్పుడు రాజధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదని, అలాంటి సిద్ధాంతాల్ని పక్కనబెట్టి శత్రువులకు ధీటైన సమాధానం ఇవ్వాలని కోరింది.
రష్యా, ఫ్రాన్స్, అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలు తమ శత్రు దేశాలకు ఘాటైన సమాధానం చెబుతాయని, వారి కోర్టులో బంతి వేయడం లాంటివి ఉండవని పేర్కొంది. భారత్పై మాత్రమే ఒత్తిడి ఎందుకు ఉంటుందని ప్రశ్నించింది.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications