Coronavirus:మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ
న్యూఢిల్లి: ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోందని ఆ మహమ్మారి నుంచి దేశ పౌరులు జాగ్రత్తతతో వ్యవహరించాలని ప్రధాని మోడీ అన్నారు. కరోనావైరస్ గురించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. స్వీయ నిర్బంధం, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి జాగ్రత్తలు పాటిస్తే మనకు మనం సహాయం చేసుకున్నవారమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వాళ్లమవుతామని ప్రధాని మోడీ అన్నారు. మార్చి 22 ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మోడీ సూచించారు. అదే సమయంలో సాయంత్రం 5 గంటల తర్వాత ప్రజలంతా తమ ఇళ్లల్లోని బాల్కానీ లేదా ఇంట్లోనే ఉండి కరోనావైరస్ నుంచి పౌరులకు సేవలు అందిస్తున్న సిబ్బంది కోసం సెల్యూట్ లేదా చప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలపాలని కోరారు. కష్ట సమయంలో దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్న వారిని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అభినందించారు. ఇక ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మినిట్ టూ మినిట్ అప్డేట్స్ మీకోసం.
Recommended Video













Click it and Unblock the Notifications