ప్రధాని మోడీ సోదరుడి వింత ధర్నా.. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయింపు
జైపూర్ : ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లద్ మోడీ ధర్నాకు దిగడం చర్చానీయాంశమైంది. జైపూర్-అజ్మీర్ నేషనల్ హైవేపై ఉన్న బగ్రు పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన బైఠాయించడం హాట్ టాపికయింది. సాక్షాత్తూ ప్రధాని సోదరుడు ఆందోళన చేయడంతో అక్కడి పోలీసులకు ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు.
జైపూర్ నుంచి అజ్మర్ వెళ్లడానికి సిద్ధమైన ప్రహ్లద్ మోడీ.. సెక్యూరిటీ సిబ్బంది విషయంలో కాస్తా బెట్టు చేశారు. ఆయనకు రక్షణగా వచ్చే ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది తన కారులో ఎక్కొద్దంటూ పట్టుబట్టారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఆయన వాహనంలో వారు కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ప్రహ్లద్ మోడీ అలా కుదరదంటూ.. వారు తన వాహనంలో ఎక్కేందుకు వీలు లేదంటూ నిరాకరించారు. తనకు కేటాయించిన సెక్యూరిటీ వాళ్లకు మరో వాహనం ఏర్పాటు చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
మొన్న తిమ్మాపూర్.. నేడు ఇల్లంతకుంట.. ఇంకెంతమంది గల్ఫ్ బాధితులో..! (వీడియో)
ప్రహ్లద్ మోడీ తీరుతో అక్కడి పోలీసులు తలలు పట్టుకున్నారు. దాదాపు గంట రెండు గంటల పాటు ఆయన అలాగే నిరసన వ్యక్తం చేశారు. చివరకు పోలీస్ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని ఆయనకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. నిబంధనలు విడమర్చి చెప్పడంతో చేసేదేమీ లేక ఆ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని తన వాహనంలోనే ఎక్కించుకుని బయలుదేరారు.