మోదీ పిలుపు, యూత్ శపథం: 100 వారాల పాటు భారీ కార్యక్రమం

వికసిత్ భారత స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న మన దేశానికి అసలైన బలం, సంపద మన యువతే! అలాంటి నవభారత నిర్మాతలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు ఎలాంటి దురలవాట్లకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఈ ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ - నషా ముక్త్ యువా' జాతీయ ప్రచారాన్ని ఆదివారం వర్చువల్ విధానంలో అత్యంత వైభవంగా ప్రారంభించారు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ భారీ ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. మత్తు పదార్థాల రహిత భారత్ కోసం చేపడుతున్న ఈ ఉద్యమం కేవలం ఒక వ్యక్తికి, కుటుంబానికి లేదా రాత్రికి రాత్రే అయిపోయే దానికి పరిమితం కాదని వ్యాఖ్యానించారు. ఇది సమాజ బాధ్యతతో పాటు ప్రతిష్టాత్మక దేశ శ్రేయస్సుకు సంబంధించిన మహత్తరమైన కార్యం అని స్పష్టం చేశారు. మన యువత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, డ్రగ్స్ ఎంతటి ప్రమాదకరమో గ్రహించి దానికి ఎల్లప్పుడూ దూరంగా ఉండేలా అవగాహన పెంచుకోవాలని కోరారు.

PM Narendra Modi Launches 100 Week Nasha Mukt Yuva Campaign to Build Drug Free Viksit Bhara

ఒంటరిగా కంటే.. 'జన భాగస్వామ్యంతో'నే అద్భుతాలు!

ఏదైనా ఒక కఠినమైన పనిని ఒక వ్యక్తి ఒంటరిగా చేపట్టడానికి ప్రయత్నిస్తే అలసట, నిరాశ ఎదురయ్యే అవకాశం ఉందన్న ప్రధాని, అదే పనిని కోట్లాది మంది భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా చేపడితే అపారమైన శక్తి ఉత్పన్నమవుతుందని చెప్పారు. గత ఏడాది కాశీలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ ప్రచారంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా 125కి పైగా ఆధ్యాత్మిక సంస్థలు హృదయపూర్వకంగా భాగస్వామ్యమయ్యాయని మోదీ వెల్లడించారు. ఈ భాగస్వామ్యమే యువత గుండెల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోందన్నారు.

మోదీ చెప్పినా తగ్గేదేలే.. బంగారం కొనుగోళ్లలో భారత్ నయా రికార్డు!
మోదీ చెప్పినా తగ్గేదేలే.. బంగారం కొనుగోళ్లలో భారత్ నయా రికార్డు!

వంద వారాల పాటు.. ప్రతి ఆదివారం పండుగలా అవగాహన!

మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిఒక్కరిని భాగస్వాములను చేసేందుకు ఈ ప్రచారంలో భాగంగా ఏకంగా 100 వారాల పాటు భారీ కార్యాచరణను రూపొందించారు. ప్రతి ఆదివారం దేశంలోని మూలమూలలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వాకథాన్‌లు, క్రీడా పోటీలు, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వీధి నాటకాలు, కళా పోటీలు, రౌండ్ టేబుల్ చర్చలను ఏర్పాటు చేసి యువతలో మార్పు తీసుకురానున్నారు.

మళ్లీ వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ- సేమ్ ప్యాటర్న్
మళ్లీ వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ- సేమ్ ప్యాటర్న్

10 వేల ప్రాంతాల్లో ప్రత్యక్షమైన యువ ఉత్సాహం

ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. దాదాపు 10,000 కంటే ఎక్కువ ప్రాంతాలలో యువత ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొని తమ మద్దతు తెలిపారు. 'మై భారత్' వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ సభ్యులు, యూత్ క్లబ్బులు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఈ మహోద్యమంలో చేతులు కలిపాయి. దేశ భవిష్యత్తు కోసం విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, పారిశ్రామిక సంఘాలు ఒకే వేదికపైకి రావడం సరికొత్త చరిత్రకు నాందిగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+