అద్భుతంగా కొత్త పార్లమెంట్: వీడియో విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: భారత కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైన వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ భవనానికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ చారిత్రక భవనాన్ని మే 28న ప్రధాని మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునాతన హంగులతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ భవన నిర్మాణం పూర్తయింది.
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ నూతన పార్లమెంటుకు సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. నూతన పార్లమెంట్ భవనం భారతీయ పౌరులందరూ గర్వించేలా ఉంటుందని పేర్కొంటూ #myparliament#mypride హ్యాష్ట్యాగ్ను జత చేశారు. ఈ భవనంలోని సమావేశ మందిరాలు, లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేక చిహ్నాలు, ఆధునాతన హంగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోకు నెటిజన్ల మంచి స్పందన వస్తోంది. రీట్వీట్ చేస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ పూర్తి షెడ్యూల్ ఇదే
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లెమెంట్ను ప్రారంభించనున్నారు. రెండు దశలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండనుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
మే 28న ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనుండగా.. ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు . ఈ వేడుక హవన్, పూజతో ప్రారంభమమై, ప్రధాని మోడీ ప్రసంగంతో ముగుస్తుంది.
అయితే, దేశంలోని పవర్ కారిడార్ అయిన సెంట్రల్ విస్టా పునరాభివృద్ధిలో భాగమైన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వివాదాస్పదమైంది. 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. టీడీపీ, బీజేడీ, మాయావతికి చెందిన బీఎస్పీ సహా దాదాపు 17 పార్టీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి.
The new Parliament building will make every Indian proud. This video offers a glimpse of this iconic building. I have a special request- share this video with your own voice-over, which conveys your thoughts. I will re-Tweet some of them. Don’t forget to use #MyParliamentMyPride. pic.twitter.com/yEt4F38e8E
— Narendra Modi (@narendramodi) May 26, 2023
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదే:
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉదయం 7:30 గంటలకే మొదలవుతుంది.
మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర హవన్, పూజతో ప్రారంభమవుతుంది. ఈ పూజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు.
8.30 గంటల వరకు ఈ పూజలు కొనసాగుతాయి.
8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో సెంగోల్ని లోక్సభలో పొందుపరచనున్నారు.
ఉదయం 9:30 గంటలకు శంకరాచార్యులు, పండితులు, పురోహితులు, సాధువులు పాల్గొనే ప్రార్థనా సభ జరుగుతుంది. ఈ ప్రార్థనా సమావేశంలో శివుడు, ఆదిశంకరులను పూజిస్తారు.
ఆ తర్వాత రెండో విడత కార్యక్రమం మొదలవుతుంది.
మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం మొదలవుతుంది.
ఈ సందర్భంగా రెండు షార్ట్ ఫిల్మ్స్ స్క్రీనింగ్ జరుగుతుంది.
అనంతరం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సందేశాన్ని రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ చదువుతారు. రాజ్యసభలో కూడా సందేశాన్ని వినిపిస్తారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమం చివర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఓ కాయిన్, స్టాంప్ విడుదల చేస్తారు.
ఆ తర్వాత 2:30 గంటలకు ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమం ముగుస్తుంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications