మీరే అందరికీ స్ఫూర్తి: శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగిన ప్రధాని మోడీ (వీడియో)
ప్రయాగ్రాజ్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగారు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్లో కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ అభర్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు మహిళ సహా ఐదుగురు శానిటేషన్ వర్కర్ల కాళ్లు కడిగారు.
ఐదుగురు వర్కర్లను కుర్చీల పైన కూర్చోబెట్టి, వారి కాళ్లను తాంబాళంలో ఉంచి చెంబు పట్టుకొని నీళ్లతో కడిగారు. మొత్తే ఐదుగురి కాళ్లు కడిగారు. అనంతరం తువ్వాలుతో వారి కాళ్లు కూడా తుడిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభభమేళా ఆరంభమైనప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు శానిటేషన్ వర్కర్లు పని చేస్తున్నారు. సెలవు లేకుండా పని చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ వారికి పాదాలు కడగాలని, సన్మానించాలని నిర్ణయం తీసుకున్నారు..

#WATCH: Prime Minister Narendra Modi washes feet of sanitation workers in Prayagraj pic.twitter.com/otTUJpqynU
— ANI UP (@ANINewsUP) February 24, 2019
అనంతరం మోడీ మాట్లాడారు. వచ్చే అక్టోబర్ 2 (2019) నాటికి స్వచ్ఛ భారత్గా మరింత ముందుకు వెళ్తుందని చెప్పారు. కుంభమేళాలో పరిశుభ్రం చేస్తున్న స్వచ్చాగ్రహిలు (కుంభమేళాలో శుభ్రం చేస్తున్నవారు) మొత్తం భారతదేశానికి స్ఫూర్తిదాయకం అని చెప్పారు.
తనకు ఇటీవల సియోల్ శాంతి బహుమతి వచ్చిందని, దీనికి వచ్చిన మొత్తాన్ని తాను గంగమ్మ తల్లి పరిశుభ్రత కోసం ఇచ్చానని చెప్పారు. గత నాలుగేళ్లుగా తనకు అవార్డుల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఈ కార్యక్రమం కోసమే ఇచ్చానని చెప్పారు.
తాను శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగిన విషయం ఎప్పటికీ గుర్తుకు ఉంటుందని మోడీ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ వారు తనతోనే ఉంటారని చెప్పారు. అలాగే వారీ ఆశీర్వాదాలు తనకు జీవితాంతం ఉంటాయని చెప్పారు.
పుణ్యస్నానం ఆచరించిన మోడీ
అంతకుముందు, ప్రధాని మోడీ ప్రయాగ్ రాజ్ కుంభమేళా వద్ద పూజలు చేశారు. గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. తాను పుణ్యస్నానం ఆచరించిన వీడియోను ట్వీట్ చేస్తూ... 130 కోట్లమంది ప్రజలు బాగుండాలని కోరుకున్నానని పేర్కొన్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications