వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినోద కార్యక్రమమే: మోడీ హవా సర్వేలపై నితీష్‌కుమార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nitish Kumar
పాట్నా: ఎన్నికల సర్వేల పైన బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) నేత నితీష్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఇటీవల పలు సర్వేలు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమి అత్యధిక స్థానాలలో గెలుస్తుందని చెబుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన సర్వేలపై స్పందించారు. ఎన్డీయే కూటమి ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందనే సర్వేల ఫలితాలను ఆయన తోసిపుచ్చారు. అటువంటి సర్వేలు కాలక్షేప, వినోద కార్యక్రమాలు తప్ప మరొకటి కాదన్నారు.

ఇటువంటి సర్వేలు అన్ని జాతి మనోభీష్టం తమకు అనుకూలంగా ఉందంటూ కొందరు చేసుకునే తప్పుడు ప్రచారాలు అని దుయ్యబట్టారు.

2005, 2010 సంవత్సరాలలో బీహార్ ఎన్నికలు జరిగినప్పుడు రెండుసార్లు త్రిశంకు సభలే ఏర్పడతాయని సర్వేలు చెప్పాయని అయితే సర్వేలు తప్పని తర్వాత వచ్చిన ఫలితాలు రుజువు చేశాయన్నారు. త్వరలో వచ్చే ఎన్నికల ఫలితాలు ఇప్పుడు చెప్పిన సర్వేలు తప్పని చెబుతాయని అభిప్రాయపడ్డారు.

English summary
With poll surveys indicating increase in seats for the BJP-led NDA under its prime ministerial candidate Narendra Modi in 2014 polls, Bihar chief minister Nitish Kumar on Monday dismissed such surveys based on small samples and said those were nothing more than "entertainment programmes".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X