వీరుడా వందనం : అమర జవాన్లకు రాష్ట్రపతి నివాళి
ఢిల్లీ : సరిహద్దులో గస్తీ కాస్తూ, విధి నిర్వహణలో ఆసువులు బాసిన అమర జవాన్లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం పాటుపడుతోన్న జవాన్ల సేవలను కీర్తించారు. మంగళవారం సీఆర్పీఎఫ్ వేలర్ డే (శౌర్య దినోత్సవం) సందర్భంగా ఢిల్లీలోని చాణక్యపురిలో గల నేషనల్ పోలీసు మెమోరియల్ వద్ద అమర జవాన్ల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళలు అర్పించారు. ఆ తర్వాత సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఇదీ నేపథ్యం ..
1965లో గుజరాత్లోని రాణ్ ఆఫ్ కుచ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు పాకిస్థాన్పై చేసిన పోరాటానికి గుర్తుగా ప్రతి ఏడాది ఏప్రిల్ 9న సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. గతేడాది పోలీసు అమరవీరు సంస్మరణ దినోత్సవం రోజున ప్రధాని మోదీ చాణక్యపురిలో పోలీసుల స్మారక ప్రదర్శనశాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ గౌబా, ఇంటిలెజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ రాజీవ్ రాయ్ భట్నగర్తో పాటు మిగతా పారామిలటరీ అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications