అయోధ్యలో కఠోర దీక్ష విరమించిన ప్రధాని మోడీ!!
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నేడు అయోధ్య మాత్రమే కాదు భారతదేశమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగుతోంది. బాలరాముడు కొలువుదీరిన భవ్యనగరి వేడుకవేళ ఊరూరా ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఏ గ్రామం చూసినా... ఏ నోట విన్నా కోదండరామయ్య కబుర్లే.. ఎచ్చట చూసినా శ్రీరాముడి రూపాలే.. ఓ పక్క అంక్షింతలు పంచుతూ శోభాయాత్రలు, మరోపక్క రఘురాముడి చిత్రాలు, చిన్నారుల వేషధారణలతో అనేక ప్రదర్శనలను నిర్వహిస్తూ పులకించిపోతున్నారు.
రామ భజనలు, ప్రత్యేక పూజలు, అన్నదానాలు, నగర సంకీర్తనలు, ప్రసాద వితరణలతో దేశం మొత్తం ఒక పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ఇక అయోధ్య రామయ్య కోసం కఠోర దీక్ష ఆచరించి రామ నామ జపంతో జనవరి 12 తేదీ నుండి రాముడిపైనే మనసు లగ్నం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపనతో తన దీక్షను విరమించారు.

అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దీక్షని పండితులు గోవింద్ దేవ్ గురూజీ మహారాజ్ తీర్థం అందించి దీక్ష విరమింపజేశారు. అనంతరం ప్రధాన నరేంద్ర మోడీ ఆ సాదు పుంగవుని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోడీ 11 రోజుల క్రితం అనుష్ఠాన దీక్ష చేపట్టి కఠినమైన నియమాలను ఆచరిస్తున్నారు.
ఎముకలు కొరుకుతున్న చలిలో చన్నీళ్ళ స్నానం చేస్తూ, నేలపై నిద్రిస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లను మాత్రమే సేవిస్తూ 11 రోజులుగా కఠోర దీక్షను కొనసాగించారు. దీక్షా సమయంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, యోగా, ధ్యానం, కఠిన తపస్సు వంటివి చేయడం చేశారు.
ఈరోజు అయోధ్యలో రామాలయం సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో కొలువుతీరిన రామ్ లల్లా కు తొలి హారతి ఇచ్చారు రామయ్య పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం చేశారు. అలాగే శ్రీరామచంద్రుని ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీకాంత దీక్షితులుకు పాదాభివందనం చేసి ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఆశీస్సులను తీసుకున్నారు. ఇక మహా క్రతువు పూర్తయిన అనంతరం మోడీ దీక్షను విరమించారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications